దర్శక ధీరుడు రాజమౌళి నుంచి ఫ్యాన్స్కి ప్రతి సంవత్సరం ఏదో ఒక సెషల్ ట్రీట్ ఉంటుంది. మరి ఈ సంవత్సరం ఆర.ఆర్.ఆర్ సినిమాని తెరకెక్కిస్తూ ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ సారి న్యూయర్కి జక్కన్న నుంచి ఫ్యాన్స్ కి ఒక సర్ప్రైజ్ ఉందంటూ తెలిపారు. ఇక ఎంతగానో ఎదురు చూసే ప్రేక్షకులకి ఆ రోజు మాత్రం ఏదో పాత పోస్టరికి రంగులు వేసి అభిమానులు షాక్ అయ్యేలా చేశారు. దాంతో ఫ్యాన్స్ నిరాశ చెందడమేకాక జక్కన్న మీద కొంత మంది సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు.
జక్కన్న అంత నిరాశ పరిచేసరికి ఇప్పటికీ ఆ షాక్ నుంచి తేరుకోని ఫ్యాన్స్ ఆయన మీద ట్రోల్స్ని కొనసాగిస్తూనే ఉన్నారు. న్యూ ఇయర్ ట్రీట్ లేకపోయినా... కనీసం గణతంత్ర దినోత్సవం సందర్భంగా అదైనా స్పెషల్గా చెబుతారని అనుకున్నారు. అయితే ఈ ఆదివారం రిపబ్లిక్ డేని పురస్కరించుకుని పలువురు హీరోలకు సంబంధించిన పోస్టర్లను..అప్ డేట్స్ ను ఇచ్చారు. కానీ ఆర్.ఆర్.ఆర్ టీమ్ మాత్రం సైలెంట్గా ఉంది. నేడు జక్కన్న టీమ్ జాతీయ జెండాను ఆవిష్కరించిన ఫొటో ఒకటి తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. దీంతో నెటిజనులు తీవ్ర ఆగ్రహానికి గురై మళ్ళీ ట్రోలింగ్ మొదలు పెట్టారు.
చాలా మంది ఈ రిపబ్లిక్ డేకి ఎంతో మంచి తమ కొత్త సినిమా విశేషాలను మాతో పంచుకుంటే ... ఆర్. ఆర్. ఆర్. టీమ్ మాత్రం పెద్ద హ్యాండిచ్చిందంటూ అభిమానులు ట్రోలింగ్స్లో రెచ్చిపోయారు. మరికొందరు ఈ జాతీయ జెండా సీన్స్ ఏవైనా ఆర్.ఆర్.ఆర్ లో ఉన్నాయా? అంటూ ఊహించని రీతిలో ప్రశ్నల్ని వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి జక్కన్నకు భలే చిక్కొచ్చి పడింది. నోరు జారిన ప్రతిసారీ ఇలా అభిమానుల నుంచి ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. అందులోను ఇద్దరు టాప్ స్టార్స్ని పెట్టి సినిమా తీస్తున్నప్పుడు. వాళ్ళ ఫ్యాన్స్ ను ఇలా మాట్లాడితే నిరాశపరిస్తే మరి ఇంతే సంగతులు. ఇలానే ట్రోల్స్ బాద పడాల్సి వస్తుంది.