బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారాచాలా మంది  కమెడియన్లు గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా,సుడిగాలి సుధీర్‌, గెటప్‌ శ్రీను, ఆటో రాంప్రసాద్‌. బుల్లితెరలో నవ్వులు పూయించిన ఈ ముగ్గురు.. ఇక వెండితెరపై నవ్వుల వర్షం కురిపించేందకు సిద్ధమయ్యారు. ఈ ముగ్గురు కీలకపాత్రలో నటించిన చిత్రం ‘3 మంకీస్‌’. 

 

తాజాగా ఈ చిత్రం నుండి ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. కామెడీ బ్రాహ్మ  బ్రహనందం చెయ్యి పడితే సినిమా హిట్ అవుతుంది అని చాలా మంది అనుకుంటారు..ఇక ఇప్పుడు ఈ సినిమా ట్రెయిలర్ ను బ్రాహ్మ చేశాడంటే సినిమా హిట్ అని అందరూ అంటున్నారు. ఇక బ్రహ్మ నందం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.ఈ ప్రపంచంలో ఎవరిని ఎక్కడ ఆపై వాడు ఎలా కలుపుతాడో ఎవరికీ తెలియదు అంటూ సాగిన డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

బ్రాహ్మీ మాట్లాడుతూ..పది రోజుల క్రితం సుధీర్, శీను, రాంప్రసాద్ నా వద్దకు వచ్చారు. గురువుగారు అని ఒకరు, గురూజీ అంటూ ఇంకొకరు, బాగా సన్నబడ్డారే అని మరొకరు మొదలెట్టారు. నాకు మ్యాటర్ అర్థమైపోయింది. ‘త్రీ మంకీస్’ ట్రైలర్ లాంచ్‌కు అతిథిగా రమ్మంటున్నారని తెలిసిపోయింది.

 

 అందుకే వారు ఏమీ చెప్పకుండానే నేను వస్తాన్రా అని అన్నాను. వీరు ముగ్గురూ నాకు కొడుకుల్లాంటివారే. నా వద్దకు రాగానే తెగ యాక్ట్ చేసేశారు. నాకు వాళ్లంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్లు కమెడియన్స్. నాకు కామెడీ చేసేవారంటే చాలా ఇష్టం. సన్నీ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకంటే పొట్టిగా ఉంటాడు’’..గతంలో సుధీర్ చేసిన సాఫ్ట్ వేర్ సుధీర్ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది మరి ఇప్పుడు ఈ సినిమా అయినా ఆకట్టుకుంటుందో లేదో చూడాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: