టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ప్రాణం ఖరీదు సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, అక్కడి నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ, నటుడిగా తన టాలెంట్ తో అనతి కాలంలోనే మెగాస్టార్ గా ఎన్నో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఇక ఆయన నటవారసులుగా వచ్చిన వారందరూ కూడా ప్రస్తుతం సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇకపోతే ఆయన చిన్న మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ అతి త్వరలో ఉప్పెన అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. 

 

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కు సోదరుడైన వైష్ణవ్ తేజ్, ఇప్పటికే నటన, డ్యాన్సులు, ఫైట్స్ వంటి వాటిలో శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ కథను అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. ఇకపోతే ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే మరొక సినిమాని లైన్లో పెట్టాడట వైష్ణవ్ తేజ్. అందుతున్న సమాచారం ప్రకారం, 

 

ఇటీవల ఓ బేబీతో మంచి సక్సెస్ ని అందుకున్న లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ తన తదుపరి సినిమా చేయనున్నట్లు టాక్. ఇప్పటికే వైష్ణవ్ కు స్టోరీ లైన్ ని వినిపించిన దర్శకురాలు నందిని, ప్రస్తుతం దాని పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో నిమగ్నం అయి ఉందని అంటున్నారు. అతి త్వరలో ఈ సినిమా విషయమై అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు చెప్తున్నారు. ఒక బడా నిర్మాత ఈ సినిమాని నిర్మించనున్నారట. మరి తన మేనమామలు, అన్నయ్య మాదిరిగా వైష్ణవ్ తేజ్ ఎంత మేర సక్సెస్ అందుకుని టాలీవుడ్ లో ముందుకు సాగుతాడో చూడాలి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: