మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్‌కు పెద్దన్నగా మారాడట. అది నిజమో కాదో తెలియదు గాని కొందరు హీరోలకు మాత్రం నిజంగానే పెద్దన్నగా కనిపిస్తున్నాడు కావచ్చు అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చిరంజీవి టైటిల్స్‌ని తెగ వాడేస్తున్నారు. అంతే కాదు ఆ సమయంలో చిరు నటించిన ఈ సినిమాలు ఎంతపెద్ద హిట్లను సాధించాయో, ఇప్పటికి కూడా ఆ టైటిల్స్ అంతే క్రేజీగా ప్రేక్షకులను ఆకర్శిస్తున్నాయనడానికి ఉదాహరణ గ్యాంగ్ లీడ‌ర్‌ టైటిల్‌ని నాని, ఖైదీ, దొంగ చిత్రాల టైటిల్స్‌ని కార్తి సొంతం చేసుకుని ఆ సినిమాల‌తో విజ‌యాల్ని ద‌క్కించుకున్నారు.

 

 

తాజాగా ఈ జాబితాలో హీరో శ్రీ‌కాంత్ చేరిపోయారు. ఇకపోతే ఒకప్పుడు యండమూరి నవల ‘మరణమృదంగం” ఎంతటి పేరును తెచ్చుకుందో అందరికి తెలిసిందే.. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, నాగ‌బాబులు హీరోలుగా నటించారు. కాగా ఇదే టైటిల్‌ మరోసారి తెరమీద ప్రత్యక్షం కానుంది. దీనిలో హీరోగా శ్రీకాంత్ నటిస్తుండగా, ఈ చిత్రానికి వెంకటేష్ రెబ్బ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా మధు రెబ్బ, చిరంజీవి వబ్బిలిశెట్టి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని లక్ష్మి రెడ్డి రెబ్బ సమర్పణలో మల్టీ కలర్ ఫ్రేమ్స్ బ్యానర్ పై రూపొందిస్తున్నారు.

 

 

ఇకపోతే 1998లో చిరంజీవి హీరోగా వ‌చ్చిన మ‌ర‌ణమృదంగం చిత్రం అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకోవడమే కాదు, వ‌సూళ్ల ప‌రంగా మంచి పేరుని కూడా సాధించుకుంది. ఇక ఎక్కువగా ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్, అప్పుడప్పుడు మాస్ క్యారెక్టర్లు ఉన్న చిత్రాల్లో కూడ నటించి ప్రేక్షకుల్ని అలరించారు. అంతే కాకుండా 2011 లో విరోధి అనే సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు.

 

 

ఇక ఈ మధ్యకాలంలో సినిమాలకు దురంగా ఉన్నా అప్పుడప్పుడు పాత్రలు నచ్చితే ఇలా తళుక్కున మెరిపోతున్న శ్రీకాంత్ మళ్లీ తాజాగా తన అభిమాన హీరో అయినా చిరు టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక నాని, కార్తీ లకు చిరు టైటిల్స్ కలిసి వచ్చినట్లే శ్రీకాంత్‌కు కూడా ఈ సినిమా విజయాన్ని అందించాలని ఆశిద్దాం...

మరింత సమాచారం తెలుసుకోండి: