అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో గతంలో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు రెండు కూడా మంచి సక్సెస్ లు అందుకున్న విషయం తెలిసిందే. వాటిలో జులాయి కొంత మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాగా, సన్ ఆఫ్ సత్యమూర్తి ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ. ఇక ఇటీవల వీరిద్దరి కలయికలో వచ్చిన అలవైకుంఠపురములో సినిమా కూడా మంచి సక్సెస్ టాక్ సంపాదించి, వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ విజయాలు నమోదుచేయడం జరిగింది. ఇటీవల అరవింద సమేత సినిమాని ఒకింత యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన త్రివిక్రమ్, ఈ అల సినిమాని మాత్రం మరింత ఎంటర్టైన్మెంట్, తో పాటు తన మార్క్ పంచ్ డైలాగ్స్ ని బాగా జోడించి తెరకెక్కించారు. ఇక బన్నీ స్టన్నింగ్ పెర్ఫార్మన్స్, సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ అందించిన సాంగ్స్, ఫైట్స్, యాక్షన్, 

 

ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ వంటివి ఈ సినిమాకు మంచి సక్సెస్ ని అందించాయి. ఇక సినిమా సక్సెస్ గురించి నేడు సినిమా యూనిట్ హైదరాబాద్ లో ఒక మీడియా మీట్ ని ఏర్పాటు చేసింది. ఈ మీట్ లో నిర్మాతలు అల్లు అరవింద్, రాధాకృష్ణ ల తో పాటు హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కూడా పాల్గొన్నారు. ఇక సినిమా మూవీ సక్సెస్ పై బన్నీ మాట్లాడుతూ, తొలిరోజు నుండి తమ సినిమాకు మంచి సక్సెస్ ని అందించి, ఇప్పటికీ కూడా మంచి కలెక్షన్స్ అందిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. ఇక సినిమా కోసం తమ యూనిట్ మొత్తం కూడా ఎంతో కష్టపడిందని, నేడు తమ కష్టానికి లభించిన ఈ ఫలితాన్ని చూస్తుంటే చెప్పలేని సంతోషంగా ఉందని అన్నారు. 

 

ఇక మీ ఫ్రెండ్ ప్రభాస్ నటించిన బాహుబలి అత్యద్భుత రికార్డ్స్ సాధిస్తే, మీ సినిమా ఏకంగా నాన్ బహుబలి రికార్డ్స్ ని అందుకుంది కదా, దీనిపై మీ ఫీలింగ్ ఏంటి అని ఒక మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్నకు బన్నీ సమాధానమిస్తూ, మా సినిమా విషయం అటుంచితే, ప్రభాస్ దాదాపుగా ఐదేళ్ల శ్రమతో బాహుబలి అత్యద్భుత విజయాలు అతనికి లభించాయి, అది సాధారణ విషయం కాదు. అలానే ఆ సినిమాల సక్సెస్ తరువాత ప్రభాస్ లభించిన క్రేజ్ అద్భుతం అని, ఇక ఆ తరువాత ప్రభాస్ మైనపు విగ్రహాన్ని మేడం టుస్సాడ్స్ లో ఏర్పాటు చేస్తున్న విషయం తెలియగానే, తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయని బన్నీ అన్నాడు.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: