టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ అలవైకుంఠపురములో ఇప్పటికే సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి మంచి టాక్ తో పాటు కలెక్షన్స్ తో కూడా ముందుకు దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడిగా పేరు గాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను గీత ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ ఎంతో భారీగా నిర్మించడం జరిగింది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ నటి టబు ఒక కీలక పాత్రలో నటించగా యువ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించడం జరిగింది. అంతకుముందే తాము రిలీజ్ చేసిన ఈ సినిమాలోని పాటలకు అత్యద్భుతంగా రెస్పాన్స్ రావడంతో పాటు, 

 

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా కూడా మంచి సక్సెస్ సాధించడంతో అల మూవీ యూనిట్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. త్రివిక్రమ్ మార్క్ పంచెస్ బాగా పేలిన ఈ సినిమాలో బన్నీ వండర్ఫుల్ యాక్షన్ కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా సక్సెస్ ని నేడు హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్ లో నిర్వహించింది సినిమా యూనిట్. ఇందులో భాగంగా హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మీడియా వారితో ఇంటరాక్ట్ అయ్యారు. ఇక హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ, 

 

నిజానికి సినిమా ఫస్ట్ డే రోజున చాలా ఏరియాల నుండి మంచి టాక్ రావడం తమకు ఆనందంగా ఉన్నప్పటికీ, ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందని అనేది తాము ముందే ఊహించలేకపోయామని, అయితే మొదటిరోజు మ్యాట్నీ షో చూసిన చిరంజీవి గారు, చూసి వచ్చిన వెంటనే ఈ సినిమా నీ కెరీర్లో మరొక రేంజ్ హిట్ సాధించడం ఖాయం అని చెప్పగానే, తాను, త్రివిక్రమ్ ఇద్దరూ కూడా ఎంతో షాక్ అయ్యాం అని అన్నారు. ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న చిరంజీవి గారు ఆ మాట చెప్పిన తరువాత అచ్చంగా అదే విధంగా సినిమా ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేస్తూ ముందుకు సాగడం ఎంతో ఆనందంగా ఉందని, అందుకే ఆయన మెగాస్టార్ గా అంతటి గొప్ప పేరు సంపాదించారని బన్నీ అన్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: