టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మంచి స్నేహితులు అన్న విషయం అందరికీ తెలిసినదే. అయితే తాజాగా త్రివిక్రమ్ తెరకెక్కించిన అల వైకుంఠ పురంబులో సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో సినిమా యూనిట్ మొత్తం సక్సెస్ సంబరాల్లో మునిగి తేలుతోంది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నటించిన రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయం సాధించారు. ఈ సందర్భంగా మీడియాతో సినిమా యూనిట్ సినిమా విశేషాల గురించి అలాగే కలెక్షన్ల గురించి అనేక విషయాలు పంచుకున్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో డైరెక్టర్ త్రివిక్రమ్ ని 'అలా వైకుంఠపురం లో' సినిమాని చూసి పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందించారు అని ప్రశ్నించగా.

 

డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ సందర్భంగా సంచలన విషయం ఒకటి బయట పెట్టాడు. ఆయన నటించిన సినిమాలన్నీ రిలీజయ్యాక మూడు నెలల తర్వాత చూస్తారని అత్తారింటికి దారేది సినిమా రిలీజయ్యాక 120 రోజులు అయ్యాక బాగా బతిమాలితే కానీ సినిమా చూడలేదని...పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయంగా చాలా బిజీగా ఉన్నారని అల వైకుంఠ పురం లో సినిమా నెలరోజుల లోపు చూడాలని కోరుకుంటున్నట్లు త్రివిక్రమ్ తెలిపారు.

 

తిరిగి పవన్ కళ్యాణ్ సినిమా రంగంలోకి రావడం పట్ల మీ స్పందన ఏంటని ప్రశ్నించగా పవన్ కళ్యాణ్ కి సినిమాలు సెకండ్ ప్రయారిటీ అని త్రివిక్రమ్ క్లారిటీ ఇచ్చారు. ఇంకా అనేక విషయాల గురించి మాట్లాడిన త్రివిక్రమ్...అలా వైకుంఠపురం లో సినిమా ఈ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అవ్వటానికి కారణం మీడియా అని మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా అల వైకుంఠ పురం లో సినిమా సూపర్ హిట్ అయిందని మొదట చెప్పింది జూనియర్ ఎన్టీఆర్ అని త్రివిక్రమ్ పేర్కొన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: