తెలుగు బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో ఎంత పాపులారిటీ సంపాదించిందో తెలిసిందే. జబర్ధస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది నటులు మంచి పొజీషన్ లోకి వచ్చారు.  ఏడేళ్ల క్రితం ప్రారంభమైన జబర్ధస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన కమెడీయన్లు ప్రస్తుతం సినిమాల్లో బిజీగా మారిపోయారు.  జబర్ధస్త్ షో అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, రాకెట్ రాఘవ స్కిట్స్.  ఇక చమ్మక్ చంద్ర లేడీ గెటప్స్ వేసుకొని చేసే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది.  ఈ మద్య జబర్ధస్త్ లో మార్పులు చేర్పులు జరిగాయి. 

 

ఏడేళ్లుగా జడ్జీగా కొనసాగుతూ వచ్చిన నాగబాబు ప్రస్తుతం జబర్ధస్త్ వీడి జీ తెలుగు లో వస్తున్న అదిరింది షోకి వెళ్లారు.  అయితే నాగబాబు వెంట కొంత మంది జబర్ధస్త కమెడయన్లు సైతం వెళ్లారు.  అందులో ముఖ్యంగా చమ్మక్ చంద్ర ఒకరు.  దీని వెనుక మరో కారణం కూడా ఉందట.  నాగబాబు జబర్ధస్త్ వీడి వచ్చేవారికి రెమ్యూనరేషన్ ఎక్కువ ఇప్పిస్తానని చెప్పినట్లు బుల్లితెర టాక్.  చమ్మక్ చంద్ర జబర్ధస్త్ వీడటానికి డబుల్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షోలో ఈయనకు కాల్షీట్ కోసం దాదాపు 3 లక్షల వరకు చెల్లించేవారని.. అలాంటి నాలుగు కాల్షీట్స్ నెలకు ఉండేవని తెలుస్తుంది.

 

అలాంటిది ఇప్పుడు జీ తెలుగులో మాత్రం అదిరింది కోసం ఒక్కో కాల్షీట్ కోసం దాదాపు 5 లక్షల వరకు తీసుకుంటున్నట్లు టాలీవుడ్ టాక్.  ఏది ఏమైనా తనను నమ్ముకొని వచ్చిన వారికి నాగబాబు ఎలాంటి ఇబ్బంది పెట్టనివ్వకుండా ముందు ముందే అన్ని ఒప్పందాలు చేసుకున్నట్లు చెబుతున్నారు.  కాకపోతే జబర్ధస్త్ తో పోల్చుకుంటే అదిరింది రేటింగ్ చాలా తక్కువగా వస్తుందని అంటున్నారు.  అయితే జబర్ధస్త్ ఆ స్థాయికి రావడానికి ఏడేళ్లు పట్టిందని.. ఇప్పుడే మొదలైన అదిరింది ని అప్పుడే అలా పోల్చడం కూడా తప్పే అని కొంతమంది నెటిజన్లు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: