స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో మంచి జోష్ మీద ఉన్నాడు. నాపేరు సూర్య అలాంటి దారుణమైన డిజాస్టర్ సినిమా తర్వాత దాదాపు ఏడాదిన్నర కు పైగా ఏ సినిమా చేయకుండా గ్యాప్ తీసుకున్న బన్నీ ‘అల వైకుంఠపురము లో’ సినిమా స్టోరీ ఓకే చేసి త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడో సినిమా చేయడంతో అభిమానులు ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో పెట్టుకొని కచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకున్నారు. అయితే సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తి కాకముందు సినిమా పాటలు మూడు నెలల ముందే ఒక్కొక్కటిగా రిలీజ్ చేసి ఈ సినిమాపై హైప్ ఒక్కసారిగా పెంచేశారు సినిమా యూనిట్.

 

తమన్ సారథ్యంలో పాటలు అద్భుతంగా తెరకెక్కడం తో సినిమా రిలీజ్ అవ్వకముందే సినిమా మ్యూజికల్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో విడుదలయ్యాక సినిమా కూడా అదే రేంజ్ లో ఉండటంతో సంక్రాంతి పండుగకు రిలీజ్ అయ్యి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పండుగ సందర్భంగా రిలీజ్ అయిన అన్ని సినిమాల కంటే ‘అలా వైకుంఠపురము లో’ సినిమా విజేతగా నిలిచింది. కొన్ని సంవత్సరాల తర్వాత బన్నీ సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ హ్యాపీ అయ్యారు.

 

ముఖ్యంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీకి హ్యాట్రిక్ పడటంతో పాటు...ఓవర్సీస్లో నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేయడం తో సినిమా యూనిట్ మొత్తం ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా సక్సెస్ సంబరాల్లో మునిగి తేలుతున్న సినిమా యూనిట్ సినిమా గురించి అనేక విషయాలు మీడియాతో ప్రేక్షకులతో పంచుకున్నగా...సినిమా ఫస్ట్ హిట్ అయిందని చెప్పింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని యూఎస్లో టాక్ తెలుసుకొని మరీ రాత్రి 11 గంటల సమయంలో నిర్మాత అల్లు అరవింద్ కి ఫోన్ చేసి చెప్పాడని మా కంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ కి సినిమా టాక్ వచ్చిందని త్రివిక్రమ్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: