అతడు చిత్రం సూపర్స్టార్ మహేష్బాబు కెరియర్లో ప్రత్యేకమైన సినిమా అని చెప్పవచ్చు. ఇప్పటికి కూడా ఆ సినిమా టీవీలో రాగానే అందరూ టీవీలకు అతుక్కుపోతుంటారు. ఆ సినిమా టెలివిజన్లో రికార్డుని సృష్టించింది. అన్ని రికార్డులు మరే సినిమాకి రాలేదనుకుంటా. ఈ చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించారు. మురారి, ఒక్కడు సినిమాల విజయాలతో ఉన్న మహేష్బాబు ఒక్కసారిగా నటుడిగానే కాకుండా ఓ స్టార్ స్టేటస్ను ఆ సినిమా తీసుకొచ్చింది. మరి అలాంటి సినిమా స్టోరీని పవర్స్టార్ పవన్ కళ్యాణ్ కథ చెప్పేటప్పుడే పడుకున్నాడట.
అయితే ఈ చిత్ర కథను మహేష్కంటే ముందు పవన్కు వినిపించచారంట త్రివిక్రమ్. అప్పటికే తరుణ్ నువ్వే నువ్వే సూపర్ హిట్ మూవీ ఇచ్చారు. అయితే ఆ కథ చెప్పేటప్పుడు పవన్ కల్యాణ్ పడుకున్నాడు.. ఈ నిజాన్ని చెప్పింది కూడా త్రివిక్రమే. వెనక గోడ సపోర్ట్ కూడా లేకుండా కేవలం స్టూల్పై కూర్చుని కునుకుపాట్లు పడుతూ పడుకున్నాడు పవర్ స్టార్. దాంతో ఆ తర్వాత మహేష్ బాబుకు ఈ కథ చెప్పాడు త్రివిక్రమ్.
మహేష్కు కథ నచ్చి ఆయన చేయడానికి ఒప్పుకున్నాడు. దీంతో తరుణ్తో నువ్వే నువ్వే చిత్రాన్ని త్వరగా పూర్తి చేసుకుని అతడు సినిమాకి ప్లాన్ చేసుకున్నాడు మాటల మాంత్రికుడు. అలా పవన్ మిస్ చేసుకున్న సినిమాను మహేష్ బాబు కెరీర్లోనే ప్రత్యేకమైన సినిమాను అందుకున్నాడు. ఏదేమైనా కూడా అతడు లాంటి స్క్రిప్ట్ చెబుతుంటే పవన్ పడుకోవడం మాత్రం నిజంగానే విడ్డూరంగా ఉంది. ఆ తర్వాత త్రివిక్రమ్తో జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి లాంటి సినిమాలు పవన్తో చేసిన విషయం తెలిసిందే.
ఇక ఇదిలా ఉంటే అతడు పవన్కన్నా కూడా మహేష్ కు బాగా సెట్ అయింది. మహేష్ మ్యానరిజమ్స్కి ఆ మూవీ కరెక్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే అందులో మహేష్కి కొన్ని సీన్లలో చాలా స్లో డైలాగ్స్ ఉంటాయి. చాలా రిజర్వడ్గా ఉంటుంది. అలాంటి పాత్రలో పవన్ను చూడటానికి ఆయన ఫ్యాన్స్ పెద్దగా ఇష్టపడరనే వాదనలు కూడా మరో వైపు వినిపిస్తున్నాయి.