బాల‌కృష్ణ బోయ‌పాటి కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న విష‌యం తెలిసిందే. ‘సింహా’, ‘లెజెండ్’ లాగానే ఈ చిత్రాన్ని కూడా బ్లాక్ బస్టర్ చేయాలనే ఆలోచ‌న‌తో ఉన్నారు బోయపాటి. ఈ సినిమాను హిట్ చేయడానికి ఉన్న అన్ని అవకాశాలను ఆయన వినియోగించుకునే పనిలో ప‌డ్డారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానున్న ఈ చిత్రం కోసం  బోయపాటి ప్రీప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్‌ని మొద‌లుపెట్టింది. ఇప్పటికే వారణాసిలో లొకేషన్లను క‌డూఆ ఫైనల్ చేసిన‌ట్లు స‌మాచారం. అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. అయితే ఈ చిత్రంలో బాలకృష్ణ విభిన్న అవతారాల్లో కనిపించనున్నారని సమాచారం.

 

ఇక ఇదిలా ఉంటే ఈ చిత్రంలో బాల‌య్య‌కు ప్ర‌తినాయ‌కుడుగా శ్రీ‌కాంత్ న‌టించ‌నున్నార‌ని సినీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మరి ఈ విష‌యం పై ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రాలేదు. అయితే బాల‌య్య‌తో క‌లిసి గ‌త చిత్రాల్లో జ‌గ‌ప‌తిబాబు విల‌న్‌గా న‌టించారు. జ‌గ‌ప‌తిబాబు, బాల‌య్య‌కు అయితే బాగానే సూట్ అయ్యారు కానీ.. మ‌రి శ్రీ‌కాంత్ సూట్ అవుతాడా అనే అనుమానాలు కొంద‌రిలో వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బాల‌య్య బోయ‌పాటి అంటేనే సాధ‌ర‌ణంగా యాక్ష‌న్ సీన్స్ ఎక్కువ‌గా ఉంటాయి. ఆ విష‌యం గురించి తెలిసిందే. ప్ర‌త్యేకంగా ఏమీ చెప్పుకోవ‌ల‌సిన అవ‌స‌రం లేదు. మ‌రి అలాంటి సీన్స్‌కి శ్రీ‌కాంత్ స‌రిపోతాడా అని కొంత మంది భావిస్తున్నారు. 

 

ఇక‌పోతే ఎమోషనల్, యాక్షన్ డ్రామాలను తెరకెక్కించడంలో బోయపాటి దిట్ట. కాస్త ఫాంటసీని కూడా జోడిస్తారు. అయితే, ఇవి కాస్త ఎక్కువైతే ‘వినయ విధేయ రామ’లా అయిపోతుంది. ఈ సినిమా తెచ్చిపెట్టిన విమర్శలతో బాలయ్య చిత్రం విషయంలో బోయపాటి జాగ్రత్తలు ఎక్కువగానే తీసుకుంటున్నారని సమాచారం. ప్ర‌స్తుతం హీరో శ్రీ‌కాంత్ మ‌ర‌ణ మృదంగం అనే చిత్రంలో న‌టిస్తున్నారు. ఈరోజు ఆ చిత్రం అనిల్‌రావిపూడి క్లాప్ కొట్టి లాంచ్ చేశారు. యువ ద‌ర్శ‌కుడు వెంక‌టేశ్ రెబ్బ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: