ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ 27 వ చిత్రాన్ని క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. వాస్త‌వానికి ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే ప్రారంభం కావాల్సింది. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల డిలే అవుతోంది. ఇందులో ప‌వ‌న్ ఓ దొంగ పాత్ర‌లో క‌నిపంచ‌న‌న్నా డ‌ని ఇప్ప‌టికే రివీల్ అయింది. ఇది ఓ పిరియాడిక్ స్టోరీ అని ప్ర‌చారం సాగుతోంది. దీనిలో భాగంగా ప‌వ‌న్ పాత్ర ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం క్రిష్ ప‌వ‌న్ కి హీరోయిన్లు వెతికే ప‌నిలో ఉన్నాడు.

 

ఇందులో ముగ్గురు హీరోయిన్లు న‌టించ‌నున్నార‌ని ఓ కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది. ఇద్ద‌రు బాలీవుడ్ భామ‌ల్ని ఒక కొత్త హీరోయిన్ ని తీసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలిసింది. అలాగే ఇది పీరియాడిక్ స్టోరీ కావ‌డంతో సంగీత ద‌ర్శ‌కుడిగా ఎం. ఎం. కీర‌వాణిని తీసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌. అయ‌న అయితేనే బెస్ట్ ఔట్ ఇవ్వ‌గ‌ల‌ర‌ని ఒప్పించే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలిసింది. అయితే అదంత ఈజీ కాదు. ప్ర‌స్తుతం కీర‌వాణి ఆర్.ఆర్.ఆర్ పై దృష్టిపెట్టారు.

 

పాట‌లు స‌హా నేప‌థ్య సంగీతం ఆయ‌నే స‌మ‌కూర్చాలి. రాజ‌మౌళిని కాద‌ని బ‌య‌ట‌కు రాలేడు. కానీ ఆర్.ఆర్.ఆర్ ఇంకా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లోనే ఉంది. అవ‌స‌రాన్ని బ‌ట్టి కీర‌వాణి ట్యూన్స్ లో బెస్ట్ ఇచ్చేందుకు ప్ర‌త్నిస్తున్నారు. సినిమా ప్రారంభ‌మైన ద‌గ్గ‌ర నుంచి జ‌క్క‌న్న‌తోనే ట్రావెల్ అవుతున్నారు. ఆ సినిమా రిలీజ్ అయ్యే వ‌ర‌కూ కీర‌వాణి ఫ్రీ అవ్వ‌ర‌ని వినిపిస్తోంది. మ‌రి ఈ బిజీ లో ప‌వ‌న్ 27కి ఒకే చెబుతారా? లేదా? అన్న‌ది చూడాలి. కీర‌వాణి మ్యూజిక్ గురించి ఈ రోజు ప్ర‌త్యేకంగా చెప్పుకునేది ఏమీ లేదు. ఎటువంటి మ్యూజిక్ నైనా స‌రే అవ‌లీల‌గా టైంకి అందిస్తార‌ని ఆయ‌న‌కి ఓ మంచి పేరు ఉంది. ఇక క్రిష్‌తో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రంలో ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు అప్పుడే మొద‌లెట్టేశారు. ప‌వ‌న్ ఇప్పుడు మంచి జోరు మీద ఉన్నార‌నే చెప్పాలి. అదే జోరు కంటిన్యూ అవ్వాలంటే పింక్  రీమేక్ హిట్ అయితే బావుంటుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: