రంగం సినిమాతో కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోను వాగా ఫేమస్ అయ్యాడు జీవా. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం స్టాలిన్ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు రెడీ అయ్యింది. వైవిధ్యభరిత చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించిన జీవా నటించిన తాజాగా రూపొందిన స్టాలిన్ తో హిట్ గ్యారెంటీ అన్న ధీమాగా ఉన్నాడట. ఇక ఈ సినిమా అందరివాడు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో జీవా సరసన రియా సుమన్ హీరోయిన్ గా నటించగా మరో హీరోయిన్ గా గాయిత్రి కృష్ణ నటించింది. ప్రముఖ తెలుగు హీరో నవదీప్ ఈ సినిమాలో విలన్ గా నటించడం విశేషం.

 

రతిన శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని తమిళంలో వరుస హిట్ చిత్రాలను అందించిన వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థతో కలసి తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్, క్విటీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా తెలుగులో అందిస్తున్నాయి.

 

ఇక ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాతలు డాక్టర్ ఇషారి కె.గణేష్, నట్టి కరుణ, నట్టి క్రాంతి  ‘ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ బాషలలో ఫిబ్రవరి 7న ఈ సినిమాని భారీగా విడుదల చేస్తున్నాము. ఇదే సినిమా తమిళంలో సీరు పేరుతో విడుదలవుతుంది. రంగం సినిమా తర్వాత ఆ స్థాయిలో కంప్లీట్ మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించాము అన్నారు. ఇక జీవా తన పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు. 

 

ఇక నవదీప్ ప్రతినాయకుడిగా ఎంతగానో ఒదిగిపోయారు. హీరోయిన్స్ ఇద్దరు తమ పాత్రలతో ప్రేకషకులను మెప్పిస్తారు. రియా సుమన్ ఇప్పటికే తెలుగులో మజ్ను, పేపర్ బాయ్ సినిమాల్లో నటించారు. 15 కోట్ల భారీ బడ్జెట్ తో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కథ డిమాండ్‌ చేసినంత ఖర్చు పెట్టడం జరిగింది. ఫిబ్రవరి 2న హైదరాబాద్ లో ఆడియోను విడుదల చేయనున్నాం. చిత్ర బృందంతో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొంటారు’ అని చిత్ర విశేషాలను తెలిపారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: