మహానటి అనే ఒక్క సినిమాతో నాగ్ అశ్విన్ పేరు టాలీవుడ్ లో మారుమోగిపోయింది. అంత గొప్ప సినిమా తీసిన డైరెక్టర్ తదుపరి సినిమా ఏంటి అని ఎదురుచూస్తున్న సమయంలో డైరెక్టర్ గా కాకుండా, మరొక రకంగా మన ముందుకు వచ్చారు. మహానటి నిర్మించిన 'స్వప్న సినిమా' బ్యానర్ లోనే ఇప్పుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా మారి ఒక సినిమా చేయబోతున్నారు అనే విషయం తెలిసిందే. 

 

'జాతి రత్నాలు' అనే టైటిల్ తో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఫేమ్ నవీన్ పోలిశెట్టి హీరోగా ఈ సినిమా ఉంటుంది. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కి కూడా ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లు ఉండబోతున్నాయి. సినిమాలో ఈ ముగ్గురూ ఖైదీలుగా కనిపించనున్నారు. ఈ మేరకు ఒక పోస్టర్ కూడా చిత్ర యూనిట్ విడుదల చేశారు.         

అయితే సినిమాకి కావాల్సిన హైప్ ఈ ముగ్గురితో అంటే కష్టం అని భావించి, సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసమని తమ మహానటి హీరోయిన్ కీర్తి సురేష్ ని దించాడు అశ్విన్. కథని మలుపు తిప్పే పాత్ర ఇదంటూ యువ నిర్మాత ఇప్పటికే హడావిడి చేసేస్తున్నాడు. ఇప్పటికే మొదలైన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పిట్టగోడ సినిమాని తెరకెక్కించిన అనుదీప్ కేవి, ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. రథన్ సంగీతం సమకూరుస్తున్నారు. మహానటి కాంబినేషన్ కావడంతో, సినిమా పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. మహానటి లో కీర్తి సురేష్ ని అంత గొప్ప పాత్రలో చూపించిన అశ్విన్, తను నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకెంత గొప్పగా చూపిస్తాడో అని ఫిలిం నగర్ లో టాక్ నడుస్తుంది. మరి ఈ అంచనాలు అందుకునే సత్తా నిర్మాతగా అశ్విన్ కి ఉందా? చూద్దాం!

 

సినిమాలో కీర్తి ఉంటే మాత్రం స్పెషల్ ఎట్రాక్షన్ ఉన్నట్టే.తెలుగు తమిళ భాషల్లో బిజీ హీరోయిన్ గా ఉన్న కీర్తి సురేష్ మిస్ ఇండియా సినిమాలో నటిస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: