టాలీవుడ్ టాప్ హీరోల్లో ప్రభాస్ ఒకరు. అమ్మాయిలందరికీ గుండెల్లో డార్లింగ్గా నిలిచిపోయిన ప్రభాస్. మొదటి చిత్రం నుంచి కూడా ఎంతో క్రేజ్ని సంపాదించుకున్నారు. తన పెదనాన్న అయిన కృష్ణంరాజు సపోర్ట్ ఎంత ఉన్నా కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్. ఒక మొట్ట మొదటి సారి తెలుగు చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా హిట్ కొట్టి ఆయన నటించిన బాహుబలి చిత్రం ప్యాన్ ఇండియా చిత్రంగా మారింది. అక్కడి నుంచి ప్రభాస్ రూటే మారిపోయింది. అత్యంత భారీ బడ్జెట్తో తీసిన ఆ చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్స్ను దుమ్మురేపింది.
ఆ తర్వాత వచ్చిన సాహో కూడా అంతే భారీ బడ్జెట్తో తెరకెక్కింది. ఆ చిత్రం కూడా ప్యాన్ ఇండియా మూవీగానే పేరు గాంచింది. కథ పరంగా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా ప్రభాస్ కి ఉన్న క్రేజ్తో కలెక్షన్ల కొరత మాత్రం ఎక్కడా రాలేదునే చెప్పాలి. ప్రస్తుతం ఆయన `జాన్` మూవీ షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుని మూడో షెడ్యూల్లో అడుగుపెట్టిన జాన్ చిత్రం శరవేగంగా షూటింగ్ని పూర్తి చేసుకుంటుంది.
ఇక ఇదిలా ఉంటే... ప్రభాస్ క్రేజ్ కేవలం ఒక్కటాలీవుడ్కే పరిమితం కాలేదు. అటు బాలీవుడ్లోనూ తనదైన గుర్తింపును తెచ్చుకున్నారు ప్రభాస్. ఇక ఇదిలా ఉంటే... ప్రభాస్ కి బాలీవుడ్ ఉన్న క్రేజ్కి ఎప్పటి నుంచో ఉన్న ఉన్న ఖాన్లకి ఒకేసారి మైండ్ బ్లాక్ అయింది. టాలవుడ్ నిర్మాతలే కాక బాలీవుడ్ నిర్మాతలు కూడా ప్రభాస్తో సినిమా తీయాలని కుతూహల పడుతున్నారు. బాలీవుడ్ టాప్ప్రొడ్యూసర్ కరణ్ జొహర్ ఆల్రెడీ ప్రభాస్తో సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాక ఇంకా చాలా మంది ప్రొడ్యూసర్లు బాలీవుడ్లో ప్రభాస్ను సినిమా కోసం సంప్రదిస్తున్నారు. దీంతో ఎప్పటి నుంచో ఉన్న షారుఖ్ఖాన్, సల్మాన్ఖాన్, సైఫలీఖాన్ ఇలా వీళ్లందరికీ ఈయన క్రేజ్ చూస్తుంటే ఏమీ అర్ధం కావడం లేదు. మరి ఒక్కసారిగా ఇంత క్రేజ్ రావడానికి ప్రధాన కారణం రాజమౌళి దర్శకత్వం వహించి తెరకెక్కించిన బాహుబలి చిత్రం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.