మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆనందంలో ఉన్నాడు. అల వైకుంఠపురములో చిత్రం నాన్ బాహుబలి రికార్డులని బద్దలు కొట్టి తన పేరు మీద లిఖించుకుంది. అయితే త్రివిక్రమ్ నుండి ఈ రేంజ్ సినిమా వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ తర్వాత త్రివిక్రమ్ పని అయిపోయిందనే వార్తలు బాగా వచ్చాయి. కథ కాపీ అని, మాటలు కూడా బాగాలేవని ఎన్నో విమర్శలు వచ్చాయి.

 

 

అయితే ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో చేసిన సినిమా అరవింద సమేత బాగానే ఉన్నప్పటికీ, అది త్రివిక్రమ్ మార్క్ మూవీ కాదని, సినిమాలు ఫ్లాప్ కావడంతో అందరిలాగే త్రివిక్రమ్ కూడా పాతదారినే పోతున్నాడని అన్న వాళ్ళు ఉన్నారు. అయితే ఈ విమర్శల నేపథ్యంలో త్రివిక్రమ్ తర్వాతి చిత్రం గురించి ఎక్కువ ప్రచారం జరగలేదు. ఎప్పుడైతే సామజవరామనా పాట రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యిందో అప్పటి నుండి అల వైకుంఠపురములో మీద అందరి దృష్టి పడింది.

 

 


మొత్తానికి త్ర్రివిక్రమ్ ఒక భారీ సక్సెస్ కొట్టాడు. తనని విమర్శిస్తున్న వారికి గట్టిగా సమాధానం చెప్పాడు. తన పని అయిపోయిందన్న వారికి తానేంటో నిరూపించాడు. ఒక రచయితగా, దర్శకుడిగా తనలో ఇంకెంతో ఉందని చూపించాడు. క్లైమాక్స్ ఫైట్ లో పాట పెట్టాలనే ఆలోచన రావడంతోనే దర్శకుడిగా అతడు గెలిచినట్టు లెక్క... అయితే ఇదిలా ఉంటే, ప్రస్తుతం త్రివిక్రమ్ కోసం తెలుగు టాప్ హీరోలందరూ క్యూ లో నిల్చున్నారు.

 

 


అయితే తన తదుపరి చిత్రాన్ని తారక్‌తో చేయాలని త్రివిక్రమ్‌ ముందే కమిట్‌ అయ్యాడు. చాలా కాలంగా పెండింగ్‌లో వున్న మహేష్‌ ప్రాజెక్ట్‌ కూడా త్వరలో ముందుకి కదలవచ్చునని అంటున్నారు. అలాగే ప్రభాస్‌ కూడా త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా చేయడానికి ఇదే తగిన తరుణమని భావిస్తున్నాడు. చరణ్‌ చాలా కాలంగా త్రివిక్రమ్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. వెంకటేష్‌, చిరంజీవితో కూడా చేస్తానని త్రివిక్రమ్‌ మాట ఇచ్చినా కానీ ఇప్పుడున్న బిజీలో వెటరన్‌ హీరోల జోలికి వెళ్లకపోవచ్చు 

మరింత సమాచారం తెలుసుకోండి: