ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో పూజ హెగ్డే మ్యానియా కనసాగుతోంది. ‘అరవింద సమేత’ ‘మహర్షి’ ‘గద్దల కొండ గణేష్’ ‘అల వైకుంఠపురములో’ మూవీల వరస విజయాలతో ఇప్పుడు ఈమె ఇండస్ట్రీ గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మారిపోయింది. దీనికితోడు ఈమెతో నటించడానికి టాప్ హీరోలు అందరు ఉత్సాహ పడుతున్న పరిస్థితులలో ఆమె డిమాండ్ చేసే రేంజ్ లో పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు.

ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం పూజ హెగ్డే నిర్మాతలకు పెడుతున్న ఒక విచిత్రమైన కండిషన్ ఇండస్ట్రీ హాట్ న్యూస్ గా మారింది. పూజ హెగ్డే కు ఆరుగురు వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు. ఆమె ఎక్కడకు షూటింగ్ కు వెళ్ళినా ఆమె వెనువెంట ఈ ఆరుగురు వ్యక్తిగత సిబ్బంది ఆమె తో ఉంటారు. 

అయితే ఇప్పుడు పూజ మ్యానియా పీక్ కు చేరడంతో ఆమె తన వ్యక్తిగత సిబ్బందికి సంబంధించిన పారితోషికాన్ని కూడ పెంచమని అడగడమే కాకుండా వారికి కూడ మంచి సౌకర్యాలతో కూడిన వసతి వారికి చాల మంచిగౌరవం ఇవ్వాలని పూజ లేటెస్ట్ కండిషన్ అని అంటున్నారు. అంతేకాదు విమాన ప్రయాణంలో తనతో పాటు తన వ్యక్తిగత సిబ్బందికి కూడ బిజినెస్ క్లా ఇవ్వాలని ఆమె కొత్తగా మరొక కండిషన్ పెడుతున్నట్లు టాక్. 

దీనితో పూజా హెగ్డే ను తీసుకోవాలి అంటే ఆమె వ్యక్తిగత సబ్బందికి సంబంధించిన భారీ కోర్కెలను కూడ తీర్చవలసిన పరిస్థితులలో వరస హిట్స్ తో పూజ హెగ్డే కు ఇగో పెరిగిపోయింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీనితో ప్రస్తుతం ఇమేజ్ లో మంచి పీక్ లో ఉన్న ఈమె అనవసరంగా ఇలాంటి వివాదాలలో ఎందుకు ఇరుక్కుంటోంది అంటూ చాల మంది ఆశ్చర్య పడుతున్నారు. దీనికితోడు ప్రస్తుతం ఈమె డిమాండ్ చేస్తున్న పారితోషికం 2 కోట్ల స్థాయికికి చేరుకోవడంతో ఈమెను భరించగలిగిన శక్తి కొద్దిమందికి మాత్రమే ఉంటుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: