ఎస్వీబీసీఛానెల్ ఛైర్మన్ వైసీపీ నేత పృథ్వీ రాజ్ మహిళ ఉద్యోగితో అసభ్యకరంగా ఫోన్లో మాట్లాడారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం పై ఆయన స్పందించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వేస్తున్నారంటూ ఆయన అన్నారు. తాజాగా ఈ విషయం పై స్పందించిన ఆయన మాట్లాడుతూ.. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని  నేను ఒక్క మాట కూడా అనలేదు.

 

ఎస్వీబీసీఛానెల్ లోని ఆడవాళ్లపై అసభ్యకరంగా మాట్లాడుతున్నని అంటున్నారు..నేను ఎవరిని ఏమి అనలేదు, ఎవరు పని వారు చేస్తుకుంటున్నారు. నేను ఎవరితో అసభ్యకరంగా మాట్లాడలేదు నాపై  కేవలం కల్పించి కక్ష్య సాధింపు చర్యలు చేయకండి అంటూ ఆయన గతంలో తెలిపిన సంగతి తెలిసిందే.. అయితే ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటుగా రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. 

 

svbc లో ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తించి.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిన పృద్వి ఇప్పుడు కక్కలేక మింగలేక ఉన్నాడు. ఇప్పుడు అవి కంటిన్యూ ఎందుకంటే పవన్ పై చేసిన వ్యాఖ్యల ఫలితంగా అలా వైకుంఠపురములో సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న పృధివి కి ఇప్పుడు మరో రెండు పెద్ద ప్రాజెక్టులు కూడా చేజారినట్టుగా టాక్. రెండు బడా సినిమాల్లో పృథ్వి పేరు పరిశీలించినప్పటికీ.. మెగా ఫ్యామిలీ తో పృథ్వి వైరం పెట్టుకోవడంతో పృద్వి పేరు తీసేసి వేరే నటులను తీసుకున్నారట.


 మరి అలా వైకుంఠం లాంటి బిగ్ హిట్ చేజారడమే కాకుండా ఇప్పుడు మరో రెండు బడా ఛాన్స్ లు మిస్ కావడంతో.. 30 ఇయర్స్ పృద్వికి ఇక సినిమా ఛాన్స్ లు కష్టమే అంటున్నారు. svbc లో కామెడీ స్కిట్స్ చేసినట్టుగా ఏ కామెడీ సినిమాలకో పృద్వి పరిమితం అవడం తప్ప అతను చేసేదేం లేదంటున్నారు. మరి ఈ చర్చలు ఎక్కడకు దారి తీస్తాయో అన్నది చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: