టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు మొన్నటి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ సాధించి, బాగానే కలెక్షన్స్ సంపాదించింది. మహేష్ బాబు ఒక మిలిటరీ మేజర్ పాత్రలో నటించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా రష్మిక మందన్న ఫస్ట్ టైం మహేష్ సరసన హీరోయిన్ గా నటించింది. మహేష్, దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి నిర్మించిన ఈ సినిమా ఓవర్ ఆల్ గా మంచి లాభాలు సంపాదించడం జరిగింది. ఇకపోతే సరిగ్గా అదే సంక్రాంతి సమయంలో రిలీజ్ అయిన మరొక సినిమా అలవైకుంఠపురములో. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించాడు. 

 

ఇకపోతే ఈ సినిమా కూడా మంచి టాక్ తో పాటు కలెక్షన్స్ కూడా సాధించింది. ఈ విధంగా రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ తో పాటు ఆయా డిస్ట్రిబ్యూటర్లకు చాలా చోట్ల లాభాలు కూడా తెచ్చిపెట్టడం జరిగింది. అయితే అల సినిమా ఒకింత ఓవర్సీస్ లో అదరగొడితే, సరిలేరు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడడం జరిగిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా, రెండు సినిమాల నిర్మాతల మధ్య మాత్రం కొద్దిపాటి పోస్టర్ల యుద్ధం మొన్నటి వరకు జరిగింది. ఒక రోజు మా సినిమా ఇంత కలెక్ట్ చేసిందని ఒకరు ప్రకటిస్తే, మా సినిమా అంతకు మించి కలెక్ట్ చేసిందని మరొకరు పోస్టర్లు వేస్తూ ప్రకటించడం మొదలెట్టారు. అయితే ఆ పోస్టర్ల వార్ తో ప్రేక్షకులు మొదట్లో విసుక్కోగా, 

 

ఆ తరువాత పూర్తిగా నవ్వుకోవడం మొదలెట్టారు. ఇక ఎట్టకేలకు ఇటీవల అల మూవీ యూనిట్, తమ సినిమా నాన్ బాహుబలి 2 ఇండస్ట్రీ హిట్ అని ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేయగా, ఆ వెంటనే సరిలేరు యూనిట్ తమ సినిమా నాన్ బాహుబలి2 ఆల్ టైం ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అంటూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. నిజానికి ఆ రెండు సినిమాలు కూడా నాన్ బాహుబలి2 హిట్స్ అయితే కాదని సమాచారం. దీనితో ఆ రెండు సినిమాల మధ్య వార్ కు తెరపడినా, ఇకపై మంచి హిట్, కలెక్షన్ సాధించే సినిమాల పై ఆ ప్రభావం పడి, అవి కూడా ప్రేక్షకుల దృష్టిలో నవ్వుల పాలు అయ్యే అవకాశాలు కూడా కొంత వరకు ఉన్నాయని అంటున్నారు సినీ విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: