యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి ఫ్రాంచైజీతో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ ని సంపాదించుకున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడు ప్రభాస్ కి ఉన్న స్టామినా స్టార్ డం తారా స్థాయిలో ఉందని చెప్పాలి. అంతేకాదు బాహుబలి క్రేజ్ తో సాహో' సినిమాని భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ లో వంశీ, ప్రమోద్ కలిసి నిర్మించిన విషయం తెల్సిందే. సాహోకు భారీగా వసూళ్లు నమోదు అయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమా బాలీవుడ్ లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాదు బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్ కంటే సాహో తో వచ్చిన క్రేజ్ నాలుగింతలు అని ప్రభాస్ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. వాస్తవంగా చూస్తే అందులో నిజముందని చెప్పాలి. టాలీవుడ్ లో ఉన్న ఏ స్టార్ హీరోకి లేని క్రేజ్ బాలీవుడ్ లో డార్లింగ్ ప్రభాస్ కి ఉందటంటే ఆయన మానియా ఏంటో అర్థం చేసుకోవచ్చు. 

 

ఇక తాజాగా జాన్ బడ్జెట్ విషయంలో యూవీ క్రియేషన్స్ నిర్మాతలు చాలా నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే భారీ బడ్జెట్ ను ఈ సినిమా కోసం ఖర్చు పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. ఐనా కూడా ఇంకా బడ్జెట్ ఎంతైనా పెట్టడానికి సిద్దంగా ఉనట్టు, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తామని అంటున్నారట. సినిమాపై అంచనాలు భారీగా ఉన్న కారణంగా ఏమాత్రం బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా నిర్మిస్తున్నట్లుగా సమాచారం. సాహో రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా జాన్ సినిమాని రూపొందించాలని పక్కాగా ప్లాన్ లో ఉన్నారట యూవీ క్రియేషన్స్ నిర్మాతలు.

 

ఇదే కాదు డార్లింగ్ ఒప్పుకోవాలే గాని బాలీవుడ్ లో పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ఆయనతో భారీ స్థాయిలో సినిమాని నిర్మించడానికి సిద్దంగా ఉన్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ ప్రభాస్ ని సంప్రదించారు కూడా. కాని డార్లింగ్ మాత్రం ప్రస్తుతానికి బాలీవుడ్ లో స్ట్రైట్ సినిమా చేయడానికి ఆసక్తిగా లేరట. ముందు మన తెలుగు ఇండస్ట్రీలో ఇంకా బ్లాక్ బస్టర్స్ ఇవ్వాలని ఇంకా తెలుగు చిత్ర పరిశ్రమ కీర్తిని పెంచాలనే ఉద్దెశ్యంతో ఉన్నారట. ఇక రీసెంట్ గా ప్రభాస్ ఒప్పుకుంటే ధూం ఫ్రాంచైజీలో నాలుగో భాగాన్ని ప్లాన్ చేస్తానని బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ ఆ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించారట. మొత్తానికి టాలీవుడ్ రారాజు ప్రభాస్ రాజు కోసం మొత్తం బాలీవుడ్ ఎదురు చూస్తుంటే డార్లింగ్ రేంజ్ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: