రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చాలా సినిమాల్లో ఓ సెంటిమెంట్ మనకు కామన్ గాకనిపిస్తుంది. అదేమిటంటే మదర్ సెంటిమెంట్. అయన మొదటి చిత్రం ఈశ్వర్ దగ్గర నుండే అమ్మ సెంటిమెంట్ స్టార్ అయ్యింది. ఈశ్వర్ యావరేజ్ గా ఆడిన సినిమాలో ప్రభాస్ ,రేవతి లమధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్ అయ్యాయి. ఇక తనను స్టార్ ను చేసిన ఛత్రపతి లో చాలా వరకు అమ్మ సెంటిమెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంట్ కూడా సూపర్ గా వర్క్ అవుట్ కావడం తో సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఇక ఈ చిత్రం తరువాత
యోగి ,
మున్నా , ఏక్ నిరంజన్ సినిమాలు కూడా అమ్మ సెంటిమెంట్ ను బేస్ చేసుకొని తెరకెక్కినవే .. అయితే ఈసినిమా లు మాత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం చెందాయి. ఇక రియల్ లైఫ్ లో కూడా
ప్రభాస్ కు అమ్మ సెంటిమెంట్ కాస్త ఎక్కువే. .
ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం తన 20వ చిత్రంలో నటిస్తూ బిజీగా వున్నాడు. ఇటీవలే ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ కాగా ప్రస్తుతం మూడు షెడ్యూల్ లు కంప్లీట్ అయ్యాయి. నాల్గో షెడ్యూల్ వచ్చే నెల మొదటి వారం లో స్టార్ట్ కానుంది. ఎలాగైనా జూలై లోపు షూటింగ్ పూర్తి చేసి సినిమా ను దసరా కానుకగా ప్రేక్షకులముందుకు తీసుకురావాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లోలవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా యువి క్రియేషన్స్ , గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఈసినిమా ఓవర్సీస్ రైట్స్ 25కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం. ఈచిత్రం తెలుగు తోపాటు హిందీ ,తమిళం లో కూడా విడుదల కానుంది.