ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ, నటభూషణ శోభన్ బాబు వంటి నటులు మంచి స్టార్ డం తో దూసుకుపోతున్న సమాయంలో తనదైన స్టైల్ లో ఆకట్టుకునే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెబల్ స్టార్ కృష్ణం రాజు, అక్కడి నుండి మెల్లగా సక్సెస్ లు అందుకుంటూ అప్పటి తరం సూపర్ స్టార్స్ లో ఒకరిగా వెలిగి, రెబల్ స్టార్ గా తనకంటూ తెలుగు ప్రేక్షకుల మనస్సులో ఒక మంచి స్థానం సంపాదించారు. బొబ్బిలి బ్రహ్మన్న, రంగూన్ రౌడీ, బుల్లెట్, తాండ్ర పాపారాయుడు, భక్త కన్నప్ప, తదితర సూపర్ డూపర్ హిట్ సినిమాలతో అప్పటి బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేసిన కృష్ణంరాజు, ఆపై ఎన్నో గొప్ప గొప్ప సినిమాల్లో నటించి మంచి పేరు, ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నారు. 

 

ఇకపోతే కొన్నేళ్ల తరువాత ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన తమ్ముడి తనయుడు ప్రభాస్, ఫస్ట్ మూవీతో మంచి సక్సెస్ ని అందుకున్నాడు. ఆ తరువాత వర్షం, ఛత్రపతి, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న ప్రభాస్, ఆపై టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు భాగాలతో ఎవరూ ఊహించని రేంజ్ సక్సెస్ ని అందుకోవడంతో పాటు మన దేశవ్యాప్తంగా విపరీతంగా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. 

 

ఇక ఆ తరువాత నుండి ప్రభాస్ రేంజ్, మార్కెట్ స్థాయి కూడా పెరగడంతో నిర్మాతలు కూడా ఆయనతో బడా ప్రాజక్టులు చేయడానికి ముందుకు వస్తన్నారు. ఇక ప్రస్తుతం యువ దర్శకుడు రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో జాన్ అనే మంచి లవ్ స్టోరీ లో నటిస్తున్న ప్రభాస్, రాబోయే వేసవిలో ఆ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇక ప్రస్తుతం ఆయనకున్న క్రేజ్ ని బట్టి చూస్తే, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు అనే రేంజ్ కి ఆయన ఎదిగాడని, పెదనాన్న గా కృషంరాజు గారు ఇది ఎంతో గర్వపడే విషయం అని అందరూ అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో మన బాహుబలి ఇంకెన్ని సక్సెస్ లు అనుకుని ముందుకు సాగుతాడో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: