బాహుబలి సినిమాల తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోవడంతో పాటు ఆయన మార్కెట్ కూడా ఇండియా రేంజ్ లో విపరీతంగా పెరిగింది. ఇక అక్కడి నుండి ఆయన సినిమాలు అన్ని కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటంతో పాటు ప్రభాస్ రెమ్యునరేషన్ కూడ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల ఆయన నుండి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో మూవీ త‌ర్వాత ప్రభాస్ రేంజ్ తో పాటు రెమ్యునరేషన్ ఇంకా పెరిగిందని అంటున్నారు. ఇక సాహో సినిమా ఇక్కడ పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ అటు బాలీవుడ్ లో మంచి మంచి వసూళ్లు అందుకోవడంతో ప్రభాస్ రేంజ్, స్టామినా ఏంటనేది బాలీవుడ్ హీరోలకు తెలిసివచ్చిందని అంటున్నారు. 

 

ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న బాలీవుడ్ హీరోల రేంజ్ కు ఏ మాత్రం తగ్గకుండా ప్రభాస్ కూడా అదే రేంజ్ లో తీసుకుంటున్నట్లు టాక్. అలానే ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో ప్రభాస్ మాట్లాడుతూ, ఇకపై తన నుండి ఎక్కువగా భారీ బడ్జెట్ సినిమాలు వస్తాయని, ఎందుకంటే బాహుబలి సినిమాల సక్సెస్ తరువాత తన ఫ్యాన్స్ ఏక్కువగా తన నుండి ఆ విధమైన భారీ సినిమాలనే ఆశిస్తున్నందువల్ల తాను కూడా ఆ తరహా సినిమాల్లోనే నటించాలని డిసైడ్ అయినట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటికే అక్కడి హీరోల గుండెల్లో గుబులు పుట్టించిన మన బాహుబలి, అతి త్వరలో స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీ చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు టాక్. 

 

మరోవైపు సంజయ్ లీలా భన్సాలీ, కరణ్ జోహార్, రోహిత్ శెట్టి వంటి బడా బాలీవుడ్ డైరెక్టర్స్ మన బాహుబలి డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారని, అన్ని కలిసి వస్తే అతి త్వరలో ఆయన డైరెక్ట్ గా బాలీవుడ్ లో అడుగుపెట్టడం ఖాయం అని తెలుస్తోంది. ఇక ఆ తరువాత నుండి ప్రభాస్ రేంజ్ ని అందుకోవడం చాలా కష్టసాధ్యం అయిన పని అని, ఈ విధంగా మన టాలీవుడ్ హీరో, అటు బాలీవుడ్ నటులను ఢీకొట్టే రేంజ్ లో ఎదగడం మన టాలీవుడ్ కు ఎంతో గర్వకారణం అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: