ఏ ముహూర్తాన టాలీవుడ్ దర్శకదిగ్గజం రాజమౌళి ప్రభాస్ తో బాహుబలి సినిమాలు తీశారో తెలియదు గాని, ఆ సినిమాలు ఎవరూ ఊహించనంత అత్యద్భుత విజయాలు అందుకోవడంతో పాటు టాలీవుడ్ వైపు పలు సినిమా ఇండస్ట్రీలు చూసే పరిస్థితి వచ్చింది. కేవలం మన దేశంలోనే కాక, పలు ఇతర దేశాల ప్రేక్షకులు సైతం తెలుగు సినిమా రేంజ్ చూసి కొంత షాక్ అయ్యారు. ఇక ఆ తరువాత హీరోగా ప్రభాస్ కు విపరీతమైన ఫ్యాన్ బేస్ తో పాటు క్రేజ్, మార్కెట్ కూడా అమాంతం పెరిగాయి అనే చెప్పాలి. 

 

ఇక ఆ తరువాత సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సాహో మూవీ కూడా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయింది. అయితే ఆశించిన రేంజ్ లో మాత్రం సక్సెస్ సాధించలేకపోయింది అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం పూజ హెగ్డే తో కలిసి జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో జాన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న ప్రభాస్, వచ్చే ఏడాది సమ్మర్ లో దానిని ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు. ఇకపోతే ప్రభాస్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో సాధారణ ప్రేక్షకులతో పాటు కోందరు బాలీవుడ్ హీరోయిన్స్ సైతం ప్రభాస్ తో నటించాలని ఉవ్విళ్లూరుతున్నారు. 


ఇక ఇప్పటికే ఆయనతో పనిచేసిన శ్ర‌ద్ధాక‌పూర్‌, పూజా హెగ్డే వంటి వారు ప్రభాస్ గొప్పతనాన్ని మెచ్చుకోగా, క‌త్రినా, దీపికా, ప్రియాంక చోప్రా వంటి వారు సైతం ఆయనతో ఒక ఛాన్స్ వస్తే వదులుకోమని ఇటీవల చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఈ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించిన మన బాహుబలి, సెట్స్ లో ఉండే ప్రతి ఒక్కరితో ఎంతో జోవియల్ గా ఉంటారని, అలానే అందరినీ కూడా డార్లింగ్ అంటూ ప్రేమతో పలకరించే ప్రభాస్ తో కాసేపు మాట్లాడితే చాలు, మన మనసు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుందని చెప్పిన నటులు కూడా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో మన బాహుబలి ఇంకెందరి మనసులు దోచుకుని ముందుకు సాగుతాడో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: