టాలీవుడ్ సినిమా పరిశ్రమలోని నటుల మంచి చెడ్డలు చూసేందుకు అప్పటి దిగ్గజ నటులు ఏర్పాటు చేసిన మా అసోసియేషన్, మొదట్లో ఎంతో గొప్పగా ముందుకు నడిచేది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, వంటి నటుల సమయంలో అసోసియేషన్ లో ఎంతో గొప్ప విలువలు ఉండేవని, అలానే నటుల్లో చిన్న, పెద్ద అనే తారతమ్యాలు లేకుండా అందరికీ సమన్యాయం జరిగేదని తెలుస్తోంది. అయితే కాలం మార్పుతో రాను రాను అసోసియేషన్ లో కూడా గ్రూపులు మొదలయ్యాయని, ఫలానా వారిది ఒక గ్రూప్ ఐతే, మరొకరిది ఇంకొక గ్రూపు అనే విధంగా రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరంటే ఒకరికి పడక ఆఖరుకి ఒకరిపై మరొకరు కక్షతో నిందారోపణలు, వివాదాలు పెట్టుకునే రేంజ్ కి నేడు మా అసోసియేషన్ చేరిందని కొందరు వాపోతున్నారు. ఇక ఇటీవల నటుడు రాజశేఖర్ మా డైరీ ఆవిష్కరణ సభలో చేసిన సంచలన వ్యాఖ్యలు మన తెలుగు వారు ఎప్పటికీ మరిచిపోలేరు. 

 

ఇకపోతే నేడు సీనియర్ నటి రాధాప్రశాంతి మాలో జరుగుతున్న కొన్ని దారుణ ఘటనలు గురించి బయటపెట్టారు. మొదటి నుండి ఏ విషయం అయినా ముక్కుసూటిగా మాట్లాడే అలవాటున్న ప్రశాంతి, ఇటీవల తనకు ఆరోగ్య సమస్యలు వచ్చి ఆసుపత్రిలో చేరితే మా నుండి కనీసం ఎలా ఉన్నారని వచ్చి చూసిన వారు కానీ, కనీసం ఫోన్ చేసిన వారు కూడా లేరని వాపోయారు. అయితే కొందరు మీడియా ఛానల్స్ మిత్రులు మాత్రం తన బాగోగుల గురించి వాకబు చేసారని చెప్పారు. అక్కడ పూర్తిగా రాజకీయాలు, స్వార్ధం, కుట్రలు ఎక్కువయ్యాయని, అలానే ఇప్పటివరకు మా కు అధ్యక్షులుగా ఎన్నికైన మురళీమోహన్, శివాజీరాజా, మొన్నటి నరేష్ సహా అందరూ కూడా మావంటి చిన్న అర్దిస్టుల గురించి కనీసం పట్టించుకోను కూడా పట్టించుకోరని, 

 

అయ్యా మా పరిస్థితి బాగోలేదు ఏదయినా సినిమాలో చిన్న వేషం ఉంటె ఇప్పించండి అని ఎందరినో ప్రాధేయపడ్డప్పటికీ ప్రయోజనం లేదని, వారి కుటుంబసభ్యులు, సంబంధీకులకే అవకాశాలు ఇప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. అంతేకాక తన ఆసుపత్రి ఖర్చులకు డబ్బుల్లేక తాను ఇబ్బందులు పడి, మధ్యలో కొన్నాళ్ళు మెడికల్ క్లెయిమ్ కట్టలేకపోతే, తన ఆర్ధిక పరిస్థితి తెలిసిన మా మెంబర్లు కూడా క్లెయిమ్ ఎందుకు కట్టడం లేదని నిలదీసి అడగడం తనకు ఎంతో బాధేసిందని అన్నారు. ఇందులో ఒక కొసమెరుపు విషయం ఏమిటంటే, కొన్నాళ్లుగా రాధాప్రశాంతి మా లో సభ్యురాలిగా కొనసాగుతూ ఉండడం......!!

మరింత సమాచారం తెలుసుకోండి: