టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తీసిన అరవింద సమేత తో పాటు కొద్దిరోజుల క్రితం బన్నీ హీరోగా తెరకెక్కించిన అలవైకుంఠపురములో సినిమాలతో వరుసగా రెండు విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు. ఇక అతి త్వరలో తన తదుపరి సినిమాని ఎన్టీఆర్ తో తీయనున్న త్రివిక్రమ్, ఇప్పటికే ఆ స్టోరీ లైన్ ని ఎన్టీఆర్ కు వినిపించగా, అది ఎంతో నచ్చిన ఎన్టీఆర్, దానిని పూర్తి స్థాయి కథగా సిద్ధం చేయమని చెప్పినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా కథ ఇదే అంటూ ఒకవార్త ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక వార్త ప్రచారం అవుతోంది. దానిని బట్టి ఈ సినిమా ముఖ్యంగా రాజకీయ అంశాల చుట్టూ తిరుగుతుందట, మంచి పేరు సంపాదించిన రాజకీయ నాయకుడైన హీరో తండ్రిని, లోకల్ లీడర్స్ కొందరు, 

 

ఢిల్లీ స్థాయిలో సెంట్రల్ లోని మరికొందరితో కలిసి మోసపూరితంగా హీరో తండ్రిని దెబ్బ తీస్తారని, ఆ తరువాత రంగప్రవేశం చేసిన హీరో, విలన్ల భారతం పట్టి చివరికి తన తండ్రికి అధికారం ఏవిధంగా అందించాడు అనేది సినిమా లోని కీలక పాయింట్ అని అంటున్నారు. మహాభారతంలో శ్రీకృష్ణుడు రాయబారం సన్నివేశంలో పాండవులతో సంధి కుదరక పోయినా ‘అయినను పోయి రావాలె హస్తినకు' అని చెప్పే వాక్యం మనకు తెలిసిందే. దానిని బేస్ చేసుకుని ఈ సినిమా టైటిల్ కూడా అయినను పోయి రావలె హస్తినకు అని నిర్ణయించారని అంటున్నారు. ఢిల్లీ రేంజ్ లో సాగె కుట్రలను భగ్నం చేసే హీరో, చివరకు ఏవిధంగా విజయం సాధించాడు అనే దానిపై సాగే ఈ సినిమాలో మంచి కమర్షియల్, ఎంటర్టైనింగ్ అంశాలు కూడా మిళితం అయి ఉండడంతో పాటు మధ్య మధ్యలో త్రివిక్రమ్ మార్క్ పంచెస్ కూడా అదిరిపోతాయని టాక్. 

 

ఇక ఇటీవల సూపర్ స్టార్ మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరు లో నటించిన రష్మిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోందని, హారిక హాసిని క్రియేషన్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్స్ సంస్థ కూడా కలసి సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా ఆగష్టులో పెట్టాలెక్కి రాబోయే జనవరిలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో చాలా వరకు వాస్తవం ఉన్నట్లు సమాచారం ఉన్నప్పటికీ, దీనిపై త్రివిక్రమ్, ఎన్టీఆర్ నుండి మాత్రం అధికారిక ప్రకటన రావలసి ఉంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: