టాలీవుడ్ బాహుబలి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు బాలీవుడ్ హీరోల రేంజ్ హీరో అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఇక బాహుబలి రెండు భాగాలతో ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లో కూడా భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించిన ప్రభాస్, ఇటీవల సుజీత్ దర్శకత్వంలో నటించిన సాహో సినిమాని కూడా నార్త్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేసారు. వాస్తవానికి మన తెలుగు రాష్ట్రాల్లో అంతగా రాణించని ఆ సినిమా, నార్త్ లో మాత్రం మంచి కలెక్షన్స్ రాబట్టడం జరిగింది. ఇక ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ మూవీలో నటిస్తున్న ప్రభాస్, ఇకపై తాను చేయబోయే సినిమాలను ఎక్కువగా భారీ బడ్జెట్ సినిమాలనే ఎంచుకోబోతున్నట్లు తెలుస్తోంది. 

 

ఇక ఈ విషయం ప్రక్కన పెడితే, ఇన్ని విషయాల్లో ఎంతో శ్రద్ధ తీసుకుంటున్న ప్రభాస్, ఒక్క విషయాన్ని మాత్రం పూర్తిగా అలక్ష్యం చేస్తూ చాలామంది ఫ్యాన్స్ ని మాత్రం నిరాశకు గురిచేస్తున్నారు. ప్రభాస్ నుంచి వేగంగా సినిమాలు కోరుకుంటున్న ఫాన్స్ ను ఆయన మాత్రం వారు ఆశించిన రేంజ్ లో వేగంగా మాత్రం సినిమాలు అందించలేకపోతున్నారు. గత ఏడాది ప్రేక్షకులు ముందుకు వచ్చిన సాహో తరువాత, ప్రస్తుతం నటిస్తున్న జాన్ వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది అంటే, దాదాపుగా రెండేళ్ల గ్యాప్ ని ప్రభాస్ తీసుకున్నట్లే అర్ధం అని, ఈ విధంగా ఒక్కో సినిమా మధ్య ఎంతో గ్యాప్ తీసుకుంటూ ముందుకు సాగుతున్న ప్రభాస్

 

ఇకపై ఇంత లాంగ్ గ్యాప్ కాకుండా వీలైనంత వేగంగా తన సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్స్ చేస్తే బెటర్ అని కొందరు అంటున్నారు. అయితే ప్రభాస్ నుండి వస్తున్నవి ఎక్కువగా భారీ బడ్జెట్ సినిమాలు కావడంతో వాటి చిత్రీకరణకు ఎంతో టైం పడుతుందని, ఇకపై రాబోయే రోజుల్లో అవకాశం ఉన్నతవరకు త్వరితగతిన తన సినిమాలు కంప్లీట్ అయ్యేలా ప్రభాస్ ప్లాన్ చేస్తాడని, మొన్నటి తన పుట్టినరోజు సందర్భంగా రెబల్ స్టార్ కృష్ణంరాజు తమ ఫ్యాన్స్ కు పర్సనల్ గా చెప్పినట్లు సమాచారం. మరి అదే కనుక నిజం అయితే, ప్రభాస్ ఫ్యాన్స్ ఇక ఫుల్ ఖుషి నే....!!

మరింత సమాచారం తెలుసుకోండి: