టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇదివరకు ఎన్నడూ లేనంత ఆనందంగా ప్రస్తుతం ఉన్నారు. దానికి కారణం ఇటీవల ఆయన హీరోగా నటించిన తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు మంచి సక్సెస్ ని అందుకోవడమే. యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు అత్యద్భుత నటనను కనబరిచారు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించగా రత్నవేలు కెమెరా మ్యాన్ గా పనిచేసారు. ఇకపోతే ఈ సినిమా విజయంతో వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకోవడంతో మరోవైపు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

 

ఇక కొద్దిరోజుల క్రితం తన ఫ్యామిలీతో కలిసి అమెరికాకు టూర్ వెళ్లిన మహేష్ బాబు, మరొక రెండున్నర నెలల్లో తిరిగి వచ్చిన తరువాత వంశీ పైడిపల్లి సినిమాలో నటించనున్నారు. ఇటీవల వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన మహర్షి సినిమా ఎంత పెద్ద విజయాన్నిఅందుకుందో తెలిసిందే. ఇక మళ్ళి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుండడంతో ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం దానిపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి అనే చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా కథ మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుండగా, ఈ సినిమాని మంచి పాన్ ఇండియా ఫీల్ తో హిందీ సహా పలు ఇతర భాషల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

 

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా భరత్ అనే నేనులో మహేష్ తో జతకట్టిన కియారా అద్వానీని హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారట దర్శకుడు వంశీ. తెలుగు తో పాటు మిగతా భాషల్లో కూడా రిలీజ్ కావలసిన సినిమా కాబట్టి, అటు బాలీవుడ్ లో కూడా మంచి సుపరిచితమైన కియారా అయితేనే ఈ సినిమాకు కరెక్ట్ అని మహేష్ కూడా భావిస్తున్నట్లు టాక్. మరొక రెండున్నర నెలల్లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: