తెలుగులో మల్టీస్టారర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఈ క్ర‌మంలోనే ఈ మధ్య కాలంలో ఇద్దరు హీరోలు కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమాలు చాలానే వచ్చాయి. ఆ సినిమాలు కూడా హిట్ ట్రాక్ తో దూసుకుపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇద్దరు స్టార్‌ హీరోలు తొలిసారి కలిసి పనిచేయబోతున్నారని టాలీవుడ్‌లో జోరుగా చర్చ సాగుతోంది. ఉత్తర-దక్షిణ ధ్రువాలుగా ఉన్న టాలీవుడ్ లోని రెండు అగ్ర కుటుంబాలకు చెందిన హీరోలు.. ఇప్పుడు ఒక సినిమాలో నటించబోతున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. ఎవ‌రా అన్న ప్ర‌శ్న‌లు మీ మైండ్‌లోకి వ‌చ్చే ఉంటాయి.

 

అదేనండీ.. టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేయ‌బోతున్న జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్‌ హీరోల కలయిక వార్త సంచలనాన్ని సృష్టిస్తోంది. ఇటీవ‌ల‌ ఎన్టీఆర్ బ‌న్నీని బావ అని పిలుస్తున్నారు. బాగా ద‌గ్గ‌ర‌గా కూడాఉంటున్నారు. మ‌రి వీరిద్ద‌రి మ‌ల్టీస్టార‌ర్ వ‌స్తే దానికి త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల‌ని ఇరువురు హీరోల ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఇది నిజమేనా.. లేక ఫిలిం నగర్ లో వినిపించే మరో పుకారో అర్ధం కావడం లేదు. కాగా, ప్రస్తుతం అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా స‌క్సెస్‌తో ఎంజాయ్ చేస్తున్నాడు. 

 

త్రివిక్రమ్ దర్శకత్వంలో సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న వ‌చ్చిన ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుంది. ఈ చిత్రం త‌ర్వాత బ‌న్నీ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసింది. ఇక మ‌రోవైపు ఎన్టీఆర్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్` సినిమాలో షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మల్టీ స్టారర్‌ మూవీలో రామ్‌ చరణ్‌ మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం త‌ర్వాత ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ కాంబోలో ఈ సినిమా చేయ‌బోతున్నారు. మ‌రి ఇంత బిజీగా ఉన్న ఈ ఇద్ద‌రు స్టార్ హీరోల మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ప్రేక్ష‌కులు ముందుకు ఎప్పుడు వ‌స్తుందో అర్థం కావ‌డం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: