సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సంక్రాంతి పండుగకు రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. వరుసగా మూడు సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో మహేష్ ఫ్యాన్స్ మంచి ఖుషి మీద ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో మహేష్ నెక్స్ట్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్న నేపథ్యంలో సినిమా గురించి రకరకాల వార్తలు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వస్తున్నాయి. మొన్నటివరకు సరిలేరు సక్సెస్ సంబరాల్లో పాల్గొన్న మహేష్ బాబు...ప్రస్తుతం కుటుంబంతో కలిసి న్యూయార్క్ నగరంలో విదేశీ టూర్ వేయడంతో త్వరలోనే ఇండియా కి రానున్న నేపథ్యంలో వచ్చిన వెంటనే సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి.

 

అయితే ఈ సినిమాలో మహేష్ గ్యాంగ్ స్టార్ తరహా లో వంశీ పైడిపల్లి మహేష్ క్యారెక్టర్ డిజైన్ చేసినట్లు వార్తలు వినబడుతున్నాయి. తెలుగు మరియు తమిళం మరియు హిందీ భాషల్లో ఈ సినిమాని విడుదల చేయాలని వంశీ పైడిపల్లి ఆలోచిస్తున్నట్లు సమాచారం. పోకిరి మరియు బిజినెస్ మాన్ తరహాలో మహేష్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఉండే పోతున్నట్లు అంతేకాకుండా ఒక స్పెషల్ పాత్రలో విజయ్ దేవరకొండ ఈ సినిమాలో నటించనున్నట్లు దానికి మహేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అనేక వార్తలు ఈ సినిమా గురించి వస్తున్నాయి.

 

ముఖ్యంగా మహేష్ మరియు విజయ్ దేవరకొండ ల మధ్య  మంచి వాతావరణం ఎప్పటి నుండో ఉండటంతో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కి కూడా సినిమాలో మంచి వెయిటేజీ ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో మహేష్ అభిమానులతో పాటు విజయ్ దేవరకొండ అభిమానులు కూడా రచ్చ రచ్చ చేస్తున్నారు. కచ్చితంగా ఇది కూడా మహేష్ కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఇద్దరు హీరోల అభిమానులు కోరుకుంటున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: