టాలీవుడ్ లో రీమేక్ సినిమాలు బ్లాక్ బస్టర్ కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకే మన తెలుగు ఫిలిం మేకర్స్ కి కోలీవుడ్ సినిమాలని రీమేక్ చేయాలంటే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. టాలీవుడ్ మేకర్స్ ఎప్పుడైనా ఒక రీమేక్ చేస్తున్నారంటే ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ హైప్ ఉంటుంది. ఇప్పుడు అంతా సోషల్ మీడియా జెనరేషన్ కాబట్టి రీమేక్ అని ప్రకటన రాగానే ఒరిజినల్ సినిమాను వెంటనే చూసేస్తున్నరు. అయినా కూడా రీమేక్ సినిమాపై మన వాళ్ళకి మోజు తగ్గడం లేదు. కానీ సమంత- శర్వానంద్ నటిస్తున్న 'జాను' సినిమాపై మాత్రం ఎందుకో పెద్దగా హైప్ రావడం లేదు. 

 

తమిళంలో సూపర్ హిట్ అయిన '96' సినిమాను తెలుగులో 'జాను' పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా 2019 డిసెంబర్ లోనే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే వరుసగా పెద్ద సినిమాలు ఉండటంతో ఈ సినిమాను వాయిదా వేశారు. కాకపోతే టీజర్.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. అవి ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే కాకుండా కాస్తో కూస్తో హైప్ వచ్చింది. ఇక రీసెంట్‌గా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటన కూడా ఇచ్చారు చిత్ర బృందం. అయితే చాలామంది ప్రేక్షకులకు ఈ అప్‌డేట్స్ ఏవీ తెలియడం లేదు. అసలు ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి అడిగితే చాలామంది ఏమో అన్న సమాధానం వస్తోంది.

 

ఇక టీజర్.. ఫస్ట్ సాంగ్ ఆకట్టుకున్నా కానీ దిల్ రాజు మాత్రం ప్రమోషన్స్ పై పెద్దగా శ్రద్ధ చూపడం లేదని తెలుస్తోంది. తమిళ వెర్షన్ తో పోలికలు ఎక్కువ అవుతాయని భారీగా ప్రమోషన్స్ చేయడం లేదని ఒక రూమర్ బాగా వినిపిస్తోంది. అయితే స్లో గా ఉండే సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చడం కష్టమని.. అందుకే ఈ సినిమా పై ఇప్పటికే ఆశలు వదులుకున్నారని అందుకే ప్రమోషన్స్ కూడా చేయకుండా వదిలేశారని కూడా కొందరు అంటున్నారు. అయితే సమంత వంటి స్టార్ హీరోయిన్, శర్వానంద్ లాంటి హీరో ఉన్నప్పటికే ఇలా క్రేజ్ అంతంత మాత్రంగా ఉండడం  దిల్ రాజు పబ్లిసిటీ స్ట్రేటజీలో లోపమేనని కూడా కొందరు ఖచ్చితంగా చెబుతున్నారు. మరి ఎందుకిలా దిల్ రాజు చేస్తునారో అర్థం కావడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: