టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహలు గుసగుసలే సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు నాగశౌర్య. ఆ తర్వాత కూడా అనేక సినిమాలతో విజయాలు సాధించిన నాగ శౌర్య చలో సినిమా తో మరింతగా తెలుగు ప్రేక్షకులను అలరించాడు. కుర్ర హీరో గా టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రిజర్వుడు గా ఉంటూ కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసే నాగశౌర్య ఎప్పటికప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి పెంచే విధంగా సినిమాలు చేస్తూ తాను చేయబోయే క్యారెక్టర్ కోసం అన్ని రకాలుగా కష్ట పడుతూ ఉంటాడు. ఇదే విషయాన్ని నాగశౌర్య తో పని చేసిన చాలామంది టెక్నీషియన్లు డైరెక్టర్లు చెబుతుంటారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం నాగ శౌర్య 'అశ్వద్ధామ' అనే సినిమా చేయడం జరిగింది.

 

అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వాయిస్ స్టార్టింగ్ లో తీసుకున్నట్లు దీనికోసం నిర్మాత శరత్ మరార్ నుండి పర్మిషన్ తీసుకున్నట్లు ఇటీవల నాగశౌర్య చెప్పుకొచ్చాడు. ఈ సినిమాని నిర్మాత ఉషా మాల్పూరి నిర్మిస్తున్నారు. విశాఖ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ఇటీవల దేశంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు ఎక్కువ జరుగుతున్న క్రమంలో ఆ క్రైమ్ లైన్ ని మెయిన్ లైన్ గా తీసుకుని సినిమాను తెరకెక్కించినట్లు ఈ సినిమాకి స్వయంగా నాగశౌర్య స్టోరీ రాసుకోవడం జరిగింది.

 

కాగా ఈ సినిమాని కొత్త డైరెక్టర్ రమణ తేజ అనే వ్యక్తి తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ వార్త చెప్పటం తో పవన్ కళ్యాణ్ వాయిస్ ఈ సినిమాలో ఉంటుంది అని తెలియజేయడంతో సోషల్ మీడియాలో ఈ వార్త రావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో సంతోష పడుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇవ్వడం తో మంచి జోష్ మీద ఉన్న అభిమానులకు ఈ వార్త మరింత జోష్ ను ఇచ్చింది. జనవరి 31వ తారీఖున భారీ స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: