గతంలో దేశ ప్రధాని మోడీ తో బేర్ గ్రిల్స్ ఉత్తరకాండ ప్రాంతంలో అడవులలో షూటింగ్ చేయడం జరిగింది. దీంతో ఆ షో ఎంతగానో డిస్కవరీ ఛానల్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అదే సందర్భంలో ఆ వీడియో ఇంటర్నెట్లో కూడా బాగా వైరల్ అయింది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా మళ్లీ బేర్ గ్రిల్స్ ఇండియన్ తో అది కూడా మోడీ తర్వాత సౌత్ ఇండియా కి చెందిన సూపర్ స్టార్ రజినీకాంత్ తో కర్ణాటక అడవుల్లో వన్యప్రాణుల మధ్య ఓ ఎపిసోడ్ చేయడానికి రెడీ అయిన విషయం అందరికి తెలిసిందే.

 

ఈ వార్త ఇటీవల బాగా వైరల్ కూడా అయ్యింది. దీంతో చాలామంది రజనీకాంత్ అభిమానులు అప్పట్లో అమెరికా ప్రెసిడెంట్ ఒబామా తర్వాత ఇండియన్ ప్రధాని మోడీతో బేర్ గ్రిల్స్ చేసిన తర్వాత రజినీకాంత్ తో షో చేయడం నిజంగా చాలా గ్రేట్ అంటూ వచ్చిన ఈ వార్తపై స్పందించడం జరిగింది. అయితే షూటింగ్ జనవరి 28వ తారీకు నుండి 30 వ తారీఖు వరకు షూట్ జరగనున్నట్లు వార్తలు వచ్చాయి.

 

అయితే అంతా అనుకున్నట్టే జనవరి 28వ తారీఖున షూటింగ్ కర్ణాటక రాష్ట్రంలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో రజినీకాంత్ మరియు బేర్ గ్రిల్స్ షూటింగ్ స్టార్ట్ చేయగా మొట్టమొదటి రోజే రజినీకాంత్ డాక్యుమెంటరీ షూటింగ్ లో ఊహించని ప్రమాదం చోటు చేసుకున్నట్లు వెంటనే షూటింగ్ స్పాట్ నుండి రజినీకాంత్ చెన్నైకి బయలుదేరినట్లు...షూటింగ్ సమయంలో అదుపు తప్పి కింద పడిపోవడంతో రజినీకాంత్ కి తీవ్ర ప్రమాదం చోటు చేసుకున్నట్లు వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని హుటా హుటిన రజినీకాంత్ చెన్నైకి వెళ్లడంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో రజనీకాంత్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన బందిపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో చోటుచేసుకుంది. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: