టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి అమెరికాకు వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వెళ్లారు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో వరుసగా మూడు అద్భుత విజయాలు అందుకున్న సూపర్ స్టార్ మహేష్, తన కెరీర్ లో ఎప్పుడూ ఇంత ఆనందంగా లేనని ఇటీవల సరిలేరు మూవీ సక్సెస్ మీట్ లో చెప్పడం జరిగింది. యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తొలిసారిగా మహేష్ బాబు ఒక మిలిటరీ మేజర్ గా నటించి అటు ప్రేక్షకులను ఇటు ఫ్యాన్స్ ని మెప్పించారు. మొన్న సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా మంచి సక్సెస్ ని అందుకున్న విషయం తెలిసిందే. 

 

మహేష్ బాబు సరసన గీత గోవిందం బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ నటీమణి విజయశాంతి, భారతి అనే మెడికల్ ప్రొఫెసర్ పాత్రలో నటించి మెప్పించారు. ఇక ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ సహా సరిలేరు యూనిట్ మొత్తం కూడా పలు మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూ లు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇటీవల అమెరికా వెళ్లేముందు ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మహేష్ బాబు ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. 

 

అయితే ఆ ఇంటర్వ్యూ లో యాంకర్ మాట్లాడుతూ, మీ ఎంటైర్ కెరీర్ లో మీకు బాగా నచ్చిన హీరోయిన్ ఎవరు అంటూ సరదాగా వేసిన ప్రశ్నకు మహేష్ కూడా మరింత ఆసక్తికరంగా సమాధానం చెప్పారు. నాకు ఎంతో నచ్చడం మాత్రమే కాదు, నేను మనసారా ప్రేమించిన హీరోయిన్ ఒకరున్నారు అని చెప్పారు. అయితే ఆమె మరెవరో కాదు నా భార్య నమ్రత, ఆమెను నేను ఎంతో ప్రేమించాను, చక్కగా ప్రస్తుతం పిల్లలతో ఎంతో హ్యాపీగా ఉన్నాను అంటూ మహేష్ బాబు చెప్పిన సమాధానానికి ఆ షో మొత్తం కూడా ఒక్కసారిగా నవ్వులు పూసింది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: