అల్లు అర్జున్ గ్యాప్ తీసుకున్నాడు. కాదు..కాదు.. గ్యాప్ వచ్చింది. అలాగే శ్రీదేవి కూతురు జాన్వి కూడా.. ప్రేమలో గ్యాప్ తీసుకొని.. మాజీ ప్రియుడితో కనిపించింది. దీంతో జాన్వీ లవ్ బ్రేేకప్ కాలేదని తేలిపోయింది. ఇంతకీ జాన్వీ మాజీ ప్రియుడు ఎవరో తెలుసా.?

 

జాన్వీ.. మాజీ కేంద్రమంత్రి షియాజీ షిండే మనుమడు శికర్ పహారియాల లవ్ స్టోరీ ఇవాల్టిది కాదు. శ్రీదేవి బతికున్న రోజుల్లోనే ఈ లవ్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. జాన్వి సినిమాల్లోకి రాకముందే.. ప్రేమలో విహరించింది. ఈ విషయంలో శ్రీదేవికి తెలిసి ముందు కెరీర్.. ఆ తర్వాత పెళ్లి అంటూ నచ్చజెప్పడం.. ఈ లోగా ఆమె చనిపోవడంతో.. జాన్వి లవ్ ఎఫైర్ బ్రేకప్ అయిందని అందరూ అనుకున్నారు. 

 

జాన్వీ కపూర్ ధడక్ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది. హీరో ఇషాన్ కట్కర్ తో సన్నిహితంగా ఉండటంతో ప్రేమ పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇవన్నీ లైట్ గా తీసుకున్న జాన్వీ.. కెరీర్ పై  దృష్టిపెట్టి... వరుస సినిమాలు చేసేస్తోంది. జాన్వీ మాజీ ప్రియుడు శిఖర్ పహారియా మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. ఆయన రాలేదు. జాన్వీ తీసుకొచ్చింది. శిఖర్ తో దిగిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ గా పెట్టడంతో.. ప్రేమకథ మళ్లీ ఊపిరిపోసుకుంది. ఇప్పటికింకా శిఖర్ ప్రేమలో ఉన్నానంటూ జాన్వీ కావాలనే ఫోటోలు పెట్టింది. మొత్తానికి జాన్వీ కపూర్ లవ్ ఎఫైర్ పై ఇపుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె తన మాజీ ప్రియుడితో కనపడటంతో రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి. ఎక్స్ లవర్ తో ఇంకా సంబంధాలున్నాయంటూ గుసగుసలాడుకుంటున్నారు. అసలు జాన్వీకపూర్ లవ్ కు ఎపుడు బ్రేకప్ పడుతుందో తెలియడం లేదు. శ్రీదేవి ఉన్నపుడు వీరిద్దరికీ కావాల్సిన పెళ్లికాస్తా ఆమె మరణంతో ఫుల్ స్టాప్ పడింది. శిఖర్ పహారియాతో జాన్వీ ప్రేమాయణం ఎంతవరకు సాగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: