సినిమా పరిశ్రమంలో కొంత మంది నటులకు అదృష్టం ఒక్కసారే కలిసి వస్తుంది. మరికొంత మందికి ఏళ్లు నటించినా అదృష్టం కలిసి రాదు.  స్టార్ హీరోలు, హీరోయిన్లు గా నటించిన వారికి కెరీర్ ఒక్కసారే అగమ్యగోచరంగా మారుతుంది.  ఈ మద్య చాలా మంది హీరోయిన్లు ఇతర భాష ఇండస్ట్రీనుంచి వస్తున్నవారే ఎక్కువ అయ్యారు. అలాంటి వారిలో నాగశౌర్య నటించిన ఛలో మూవీతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది రష్మిక మందన.  కుర్ర హీరోలతో తన జర్నీ మొదలుపెట్టిన రష్మికకి, అదృష్టం కలిసొచ్చింది. దాంతో వరుస సినిమాలు వరిస్తున్నాయి .. వరుస సక్సెస్ లు దక్కుతున్నాయి.

 

ఇటీవలే మహేశ్ జోడీగా ఆమె చేసిన 'సరిలేరు నీకెవ్వరు' భారీ విజయాన్ని అందించింది.  ముఖ్యంగా విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ‘గీతాగోవిందం’ మూవీతో మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.  ఆ తర్వాత ఈ జంట నటించిన ‘డీయర్ కామ్రెడ్’ పెద్దగా అలరించలేక పోయింది.  అయితే రష్మికు నటించిన సినిమాలకు పాజిటీవ్ టాక్ రావడంతో ఈ అమ్మడు గోల్డెన్ లెగ్ అని అంటున్నారు. వరుసగా మంచి విజయాలు అందుకుంటున్న రష్మికు ఇప్పటికే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం వరుసగా అందుకుంటుంది.  సుకుమార్ తో బన్నీ చేయనున్న సినిమాలో కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది.

 

ఇదో గోల్డెన్ ఛాన్సు అనుకుంటున్న సమయంలో మరో గోల్డెన్ ఛాన్స్ కోట్టేసిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నారు. ఎన్టీఆర్ సరసన చేసే అవకాశం కూడా లభించిందని అంటున్నారు. అల వైకుంఠపురములో సినిమాతో విజయాన్ని అందుకున్న త్రివిక్రమ్ తదుపరి సినిమాను ఎన్టీఆర్ తో చేయనున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేష్ లో అరవింద సమేత తో మంచి హిట్ అందుకున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన  రష్మిక అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట. దాంతో ఎన్టీఆర్  ఈ సినిమాలో ఆమె ఖాయమైపోయినట్టేనని అంటున్నారు టాలీవుడ్ టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: