టాలీవుడ్ లోకి ఏం మాయ చేసావే మూవీతో హీరోయిన్ గా పరిచయం అయిన నటి సమంత.  కోలీవుడ్ నుంచి వచ్చిన హీరోయిన్లలో సమంత ఒకరు.  కాకపోతే ఈ అమ్మడికి తెలుగు, తమిళంలో మంచి ఛాన్సులు రావడంతో మాలీవుడ్ లో కాకుండా ఇక్కడే స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయింది.  అంతే కాదు ఏం మాయ చేసావే మూవీలో తన సహనటుడు అయిన నాగ చైతన్యను వివాహం చేసుకొని అక్కినేని వారి ఇంటికి కోడలుగా వెళ్లింది.  సాధారణంగా వివాహం జరిగిన తర్వాత చాలా మంది హీరోయిన్లు సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేస్తారు. అయితే సమంత విషయంలో కూడా ఇదే జరుగుతుందని భావించారు. కానీ అంతా రివర్స్ అయ్యింది.. వివాహం తర్వాత సమంత బ్లాక్ బస్టర్ మూవీస్ లో నటిస్తూ వచ్చింది. 

 

అంతే కాదు ఆమె నటించిన యూటర్న్, ఓ బేబి లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా సూపర్ హిట్ అందుకున్నాయి.  దాంతో మరికొంత కాలం హీరోయిన్ గా సమంతకు ఎలాంటి ఢోకా లేదని భావిస్తున్నారు.  ఇదిలా ఏంటే సమంత, నాగ చైతన్య కలిసి నటించిన మజిలీ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది.  మరోసారి ఈ జంట తెరపైకి వస్తున్నట్లు ఆ మద్య వార్తలు వచ్చాయి. ఇక  స్టార్  డం అనేది ఓవర్ నైట్ లో వచ్చేది కాదని... ఎంతో కష్టపడితేనే ఏదైనా సాధ్యమని  ఈ మధ్య కాలంలో కథల ఎంపిక, పాత్రల ఎంపికలోచాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమంత తెలిపింది.

 

కెరీర్ మొదట్లో ఎలా ఉంటే ఇండస్ట్రీలో నిలబడగలమో అలాంటి సినిమాలు చేశా అని.. కానీ ఇప్పుడు నటిగా తనదైన ముద్ర వెయ్యాలని దానికి తగ్గట్టుగా కథల ఎంపిక చేసుకుంటున్నాని అంటున్నారు.  దర్శకులు ఏం కోరుకుంటున్నారో, మనం ఏం చేయగలమో అనేది దర్శకులకు సంకేతాలిస్తుంటే ఆ పాత్రలకు తగిన ప్రాధాన్యత ఉందా లేదా అనేది మనకు తెలిసిపోతుందని సమంత అంటున్నారు. ఏది ఏమైనా ఇకనుంచి గ్లామర్ పాత్రలకు స్వస్తి చెప్పి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తానని అంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: