పెళ్ళి అయిన తరువాత కూడ టాప్ హీరోయిన్ స్టేటస్ ను కొనసాగిస్తున్న ఒకవైపు సినిమాలలో వెబ్ సిరీస్ లో నటిస్తూనే త్వరలో విద్య రంగంలోకి అడుగులు వేయబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. విద్య వ్యాపారంగా మారిన పరిస్థితులలో అనేక ప్రముఖ కార్పోరేట్ సంస్థలు ప్రీ స్కూల్ బిజినెస్ లలోకి కూడ ఎంటర్ అవుతున్నారు. 

ప్రస్తుతం ప్రీ స్కూల్ బిజినెస్ కాసులు కురిపించే బిజినెస్ గా మారడంతో ఈ వ్యాపారంలోకి ఫిలిం సెలెబ్రెటీలు కూడ ఎంటర్ అవుతున్నారు. ఇప్పటికే మంచు విష్ణు జీవితా రాజశేఖర్ రాశి లు ఈ ప్రీ స్కూల్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారు. ఇప్పుడు సమంత కూడ ఈ బిజినెస్ ను ఎంచుకుని ఒక చైన్ ఆఫ్ ప్రీ స్కూల్స్ ను తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలలో ప్రారంభించే ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  

హైదరాబాద్ కు చెందిన మాజీ మిస్ ఫ్యాషనిస్ట్ శిల్పా రెడ్డి తో కలిసి ఈ ప్రీస్కూల్ చైన్ ను సమంత ప్రారంభిస్తోంది. దీనికోసం అత్యంత విలాసవంతమైన జూబ్లీ హిల్స్ ఏరియాను ఆమె ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రీ స్కూల్ నర్సరీ ప్రైమరీ స్కూల్  పీపీ 2 స్కూళ్లను అధునాతనంగా లాంచ్ చేయాలన్నది సమంత ప్లాన్. ‘ఏకం’ అనే పేరుతో ఈ ప్రీ స్కూల్స్ నడుస్తాయని తెలుస్తోంది. 

ఈ స్కూల్స్ లో పిల్లలకు పర్యావరణం పైన అవగాహనకు సంబంధించి ప్రత్యేక శిక్షణ ఇవ్వడమే కాకుండా పిల్లల వయసును బట్టి వివిధ రకాల కోర్సులను ప్రవేశ పెడతారని తెలుస్తోంది. భాగ్యనరంలో ది బెస్ట్ ప్రీ స్కూల్ చైన్ గా నిలబెట్టాలని సమంత చేస్తున్న ప్రయత్నాల వెనుక  నాగచైతన్య నాగార్జునల ప్రోత్సాహం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. స్వతహాగా పిల్లలు అన్నా అనాథ బాలలు అంటే మంచి ప్రేమ ఉన్న సమంత బిజినెస్ లో కూడ రానిస్తే నటిగానే కాకుండా బిజినెస్ ఉమెన్ గా పేరు సంపాదించుకునే ఆస్కారం ఉంది..   

మరింత సమాచారం తెలుసుకోండి: