తెలుగులో సెన్సిబుల్ చిత్రాలు తీయడంలో దిట్టగా పేరున్న వారిలో క్రిష్ కూడా ఒకరు. గమ్యం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన క్రిష్, వేదం సినిమాతో తనలోని దర్శకుడు ఎలాంటివాడో చూపించాడు. ఆ తర్వాత అతడి దర్శకత్వంలో వచ్చిన కంచె, కృష్ణం వందే జగద్గురుమ్, గౌతమి పుత్ర శాతకర్ణి, సినిమాలు ఆయన కెరీర్లో మంచి చిత్రాలుగా నిలిచిపోయాయి. అయితే గత ఏడాది ఆయన నుండి రెండు డిజాస్టర్లు వచ్చాయి.

 

 

ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు రూపంలో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ రావడంతో క్రిష్ కొంత గ్యాప్ తీసుకున్నాడు. అయితే ఈ గ్యాప్ లో క్రిష్ మంచి స్క్రిప్టుని సిద్ధం చేసుకున్నాడు. దానికి పవన్ కళ్యాణ్ ని హీరోగా అనుకుని ఆయన డేట్లు కూడా పట్టేశాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బాలీవుడ్ చిత్రమైన పింక్ రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ అవగానే పవన్ క్రిష్ దర్శకత్వంలో నటిస్తాడు. 

 

 

అయితే పవన్ తో సినిమా అనంతరం క్రిష్ వరుణ్ తేజ్ తో సినిమా చేస్తాడట. వరుణ్ తేజ్ ,క్రిష్ కాంబినేషన్ లో వచ్చిన కంచె సినిమా అనుకున్నంతగా విజయం సాధించలేకపోయినా విమర్శకుల ప్రశంసలు గెలుచుకోవడంతో పాటు ఒక మంచి చిత్రంగా నిలిచిపోయింది. ప్రస్తుతం పవన్ సినిమాను వీలైనంత త్వరగా ఫినిష్ చేసి సినిమాను థియేటర్స్ లోకి తీసుకురావాలని చూస్తున్నాడు. ఈ సినిమా పూర్తవ్వగానే వరుణ్ ను డైరెక్ట్ చేస్తాడట. 

 

 

సో వెంట వెంటనే బాబాయ్ అబ్బాయ్ లతో సినిమాలు ప్లాన్ చేసుకుంటూ మళ్ళీ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. మరి పవన్ సినిమాతో క్రిష్ అందరినీ మెప్పించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఆ వెంటనే వరుణ్ తో సూపర్ హిట్ కొడతాడా చూడాలి.  చాలా గ్యాప్ తర్వాత వస్తున్న క్రిష్ ఈ సారైనా మళ్లీ హియ్ కొడతాడా లేదా చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: