మీకు గుర్తు ఉందా? రెండు రోజుల క్రితం కొన్ని వార్తలు వచ్చాయి.. ఆ వార్తలు ఏంటి అంటే? నటుడు ప్రకాష్ రాజ్ ను 29 న చంపేస్తాం అని బెదిరింపు వార్తలు వచ్చాయి. అయితే ఈ బెదిరింపు వార్తలలో ఎంత నిజం ఉంది అనేది ఎవరికి తెలియదు.. కానీ ప్రకాష్ రాజ్ తో పాటు మరో 14 మందిని కూడా చంపేస్తాం అని బిదిరించినట్టు వార్తలు వచ్చాయి.. 

 

అయితే ఆ వార్తలు ఎంత నిజం అనేది తెలియదు కానీ.. మీడియా అంత ఒక్కసారిగా ఆ బెదిరింపులు చూసి షాక్ అయ్యింది. అసలు ఏం జరిగింది అంటే? బెంగళూరులోని బెళగావిలోని నిజగుణానందస్వామి మఠానికి మూడు రోజులు క్రితం ఓ లేఖ వచ్చింది. ప్రకాష్ రాజ్ తో పాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, బృందా కారత్‌, నిజాగుణానంద స్వామి, యాక్టర్‌ చేతన్‌ కుమార్‌, భజరంగ్‌ దళ్‌ నాయకుడు మహేంద్రకుమార్‌, జర్నలిస్ట్‌ అగ్ని శ్రీధర్‌ పేర్లు కూడా అందులో ఉన్నాయి.

 

అయితే ఈ లేఖను కన్నడలో రాశారు.. ఆ లేఖలో వాళ్ళను ఎందుకు చంపుతాం అని రాశారు అంటే.. ఈ 15 మంది ధర్మ ద్రోహులు, దేశద్రోహులు అని.. అందుకే వారిని చంపడానికి జనవరి 29 అంటే ఈరోజున ముహూర్తం పెట్టమని వారు పేర్కొన్నారు. అంతేకాదు.. కైలాస ప్రయాణానికి.. భూమిని వదిలి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి అని నిజగుణానందస్వామీని.. మరో 14 మందిని ఉద్దేశిస్తూ చాలా స్ట్రాంగ్ గా ఆ లేక రాశారు. 

 

అయితే ఈ బెదిరింపు లేఖను చూసి ఆందోళనకు గురైన ఆశ్రమవాసులు.. లేఖను బెళగావి జిల్లా ఎస్పీకి అందజేశారు. దీంతో పోలీసులు ఆశ్రమానికి అదనపు భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. అయితే.. వారు బెదిరించినట్టు ఆ రోజు వచ్చేసింది.. ఆ బెదిరింపులలో 15 మంది ప్రస్తుతం పూర్తి భద్రతలో ఉన్నారు.. కానీ ప్రకాష్ రాజ్ ఎక్కడ ఉన్నాడు అనేది మాత్రం తెలియటం లేదు.. అంతేకాదు.. నిజంగానే ఆ 15మందిని ఈరోజు చంపేస్తారా? వారు అందరు కూడా ప్రముఖులే.. వారి అందరి గురించి ప్రస్తుతం పక్కన పెట్టిన మన ప్రకాష్ రాజ్ కు ఏం జరగనుంది అనేదే ప్రస్తుతం టెన్షన్ గా ఉంది.. మరి అసలు ఈరోజు ఏం జరగనుంది ? ప్రకాష్ రాజ్ సేఫ్ అంటారా?

మరింత సమాచారం తెలుసుకోండి: