బాహుబలి2 తర్వాత దర్శకధీరుడు రాజమౌళి కొంత గ్యాప్ తీసుకొని ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి అగ్ర హీరోలతో ‘ఆర్ఆర్ఆర్’ లాంటి మల్టీస్టారర్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి కొన్ని షెడ్యూల్స్ కూడా పూర్తి అయ్యాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వికారాబాద్ అటవీ ప్రాంతంలో కొనసాగుతున్నది. గత కొంత కాలంగా ఆర్ఆర్ఆర్ మూవీ గురించి రక రకాల వార్తలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. ఈ మూవీలో నటిస్తున్న ఇద్దరు హీరోలకు గాయాలు కావడం... కొంత కాలం విరామం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత కొన్ని సన్నివేశాలకు సంబంధించిన వీడియో, ఫోటోలు లీక్ అయ్యాయి.. ఆ తర్వాత సినిమా రిలీజ్ పై రక రకాల కథనాలు వస్తున్నాయి.

 

ఇలా ప్రతిరోజూ ఆర్ఆర్ఆర్ మూవీపై అనుకోని ప్రచారాలు జరగడం ఓ రకంగా క్రేజ్ వస్తున్నా.. ఫ్యాన్స్ కి మాత్రం టెన్షన్ వస్తుంది. ఇంతకీ ఈ మూవీ ఎప్పుడు పూర్తి అవుతుంది.. ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న విషయంపై రక రకాల కథనాలు వస్తున్నాయి. తాజాగా ఈ ఆర్ఆర్ఆర్ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.  ఈ మూవీలో కీలకపాత్రలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ నటిస్తున్నాడు.. అతని భార్యగా శ్రీయా శరణ్ ను తీసుకుంటున్నట్లు సమాచారం.  

 

త్వరలో షూటింగ్ లో పాల్గొనేందుకు శ్రీయ కూడా సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఇతర పాత్రల తరహాలోనే శ్రీయ రోల్ కూడా చాలా కీలకమైనది అని అంటున్నారు. గతంలో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ సూపర్ హిట్ మూవీ చత్రపతి లో శ్రీయ నటించింది. కాగా, ఈ మూవీలో బ్రిటన్ రంగస్థల నటి ఒలివియో మోరిస్, బాలీవుడ్ భామ అలియా భట్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.  ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందని టాలీవుడ్ టాక్.  ఈ మూవీతో మళ్లీ శ్రియ లైన్లోకి వస్తుందని అనుకుంటున్నారు టాలీవుడ్ వర్గాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: