ఈమద్య కాలంలో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలను హోల్ సేల్ గా కొనేసి రిలీజ్ చేస్తున్న నిర్మాత అభిషేక్ నామ. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ మీద ఈ మధ్య వచ్చిన పలు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అభిషేక్ పిక్చర్స్ లో డైరెక్ట్ గా సినిమాలు నిర్మించడంతో పాటు ఇతర నిర్మాతలు నిర్మించిన సినిమాలను విడుదల చేస్తున్నాడు. మంచి సినిమాలు ప్రేక్షకులకు చేరాలనె అభిషేక్ నామా మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను రిలీజ్ చేసి ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు.

 

ఈ క్రమంలోనే ఈ సారి జోహార్ అనే సినిమాని విడుదల చేసేందుకు అభిషేక్ పిక్చర్స్ వాళ్ళు సిద్దమయ్యారు. తేజ మార్ని దర్శకత్వంలో భాను సందీప్ ధర్మ సూర్య పిక్చర్స్ బ్యానర్ లో నిర్మించాడు. ఈ సినిమాలో దృశ్యం ఫేం ఎస్తర్ అనీల్ ముఖ్య పాత్రలో నటించింది. ఈశ్వరి రావు, సుభలేక సుధాకర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మొత్తం అయిదు పాత్రల మద్య సాగే ఒక రాజకీయ డ్రామాగా ఈ సినిమాని రూపిందించామని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా కంటెంట్ నచ్చడంతో అభిషేక్ నామా విడుదల చేసేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. అంతేకాదు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ తో పాటు నాన్ థియేట్రికల్ రైట్స్ ను కూడా అభిషేక్ పిక్చర్స్ దక్కించుకున్నట్లుగా అభిషేక్ నామా ప్రకటించారు. 

 

2019 లో రాక్షసుడు.. ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన అభిషేక్ పిక్చర్స్ రీసెంట్‌గా విజయ్ దేవరకొండ నటించిన 'వలర్డ్ ఫేమస్ లవర్' సినిమా ఆంధ్రా రైట్స్ ను దక్కించుకుంది. అలాగే మరో తాజా చిత్రం 'ప్రెషర్ కుక్కర్' ని కూడా అభిషేక్ పిక్చర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాల్లో ఉన్నారు. ఇలా ప్రస్తుతం టాలీవుడ్ లో అభిషేక్ పిక్చర్స్ పేరు మార్మోగిపోతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: