తెలుగులో ముకుంద, ఒక లైలా కోసం మూవీలో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే ఆ మూవీస్ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో అవకాశాల కోసం బాలీవుడ్ లో ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో హృతిక్ రోషన్ నటించిన మోహింజుదారో మూవీలో ఛాన్స్ రావడం..ఆ మూవీ డిజాస్టర్ కావడం జరిగింది. దాంతో మంచి మళ్లీ తెలుగు లో ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న పూజా హెగ్డేకి అదృష్టం బన్నీ రూపంలో కలిసి వచ్చింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ మూవీలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో పూజా హెగ్డే ఓ రేంజ్ లో రెచ్చిపోవడం.. ముఖ్యంగా బికినీ సిన్లో కుర్రాళ్ల మతులు పోగొట్టంది. అంతే ఈ అమ్మడికి తెలుగు లో స్టార్ హీరోల సరసన వరుస ఛాన్సులు రావడం మొదలయ్యాయి.
అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్, వరుణ్ తేజ్, ప్రభాస్ త్వరలో అఖిల్ సరసన నటిస్తుంది. ఇలా స్టార్ హీరోల సరసన నటిస్తున్న పూజా హెగ్డే తన జీవితంలో కొన్ని సంఘటన గురించి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. బాలీవుడ్ ప్లే బాయ్ రణబీర్ కపూర్ కి పూజా హెగ్డే పదే పదే క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందట. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. తాను కెరీర్ బిగినింగ్ లో ఓ యాడ్ ఫిలిమ్ లో చేసే అవకాశం వచ్చిందట. ఆ యాడ్ లో బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ నటిస్తున్నాడట. అప్పటికే రణ బీర్ బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న హీరో.
అదృష్టం కొద్ది రణబీర్ కపూర్ తో కలిసి పనిచేయాల్సి వచ్చిందట. అయితే టాప్ హీరో రణబీర్ కపూర్ ని చూసి కాస్త కంగారు పడి.. తాను చెయ్యాల్సిన సీన్ తాలూకు సన్నివేశాల కోసం టేక్స్ మీద టేక్స్ తీసుకోవాల్సి వచ్చిదేనట. టేక్ తీసుకుంటున్నప్పుడల్లా సారీ... సారీ అంటూ చెప్పిందట. రణబీర్ కపూర్ కి చాలాసార్లు క్షమాపణ చెప్పిందట. అయితే అన్నిసార్లు క్షమాపణ చెప్పడంతో... రణబీర్ కపూర్ కాస్త గిల్టీగా ఫీల్ అయి.. ఇన్నిసార్లు క్షమాపణ చెప్పకు నాకు ఇబ్బందిగా ఉంది అంటూ సున్నితంగా హెచ్చరించడంతో దాంతో సారీ అడగం మానేసిందట. అప్పుడు టేక్ ఒకే కావడంతో థ్యాంక్స్ చెప్పిందట.