శర్వానంద్‌, సమంత జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘జాను’. తమిళ్ సినిమా 96 రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి రెండు రోజుల క్రితం ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించింది. అయితే ఆ ఫస్ట్ లుక్ లో సమంత లేకపోవడంతో అభిమానులు బాగా హర్ట్ అయ్యారు.. టీజర్ వెంటనే విడుదల చేసి కూల్ చేశారు.. టీజర్ తో అంచనాలు పెంచిన ఈ సినిమా ట్రైలర్ ను ఈరోజు విదుదల చేసింది.    

 

అయితే ఈ ట్రైలర్ ఓ అద్భుతం అనే చెప్పాలి.. ఎందుకంటే.. ఈ ట్రైలర్ చూస్తే ఒక్క జాను, రామ చంద్రన్ కు మాత్రమే కాదు.. స్కూల్ సమయంలో ప్రేమించుకున్న ప్రతి ఒక్కరికి వారి జ్ఞాపకాలు గుర్తొచ్చేస్తాయి. అంత అద్బుతంగా ఉంది ఈ ట్రైలర్.. అసలు జాను ట్రైలర్ ఎలా ఉంది అంటే..    

 

శర్వానంద్ చెప్పే డైలాగ్ తో మొదలైన ఈ ట్రైలర్ మనసును హత్తుకునేలా ఉంది.. ప్రస్తుతానికి టీజర్ లో ఉన్నంత ఎమోషన్స్ ఈ ట్రైలర్ లో కనిపించకపోయినప్పటికీ సినిమాపై అంచలనాలను మాత్రం భారీగా పెంచేసింది. సినిమా ట్రైలర్ చుసిన ప్రతి ఒక్కరు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూసేలా సినిమా ట్రైలర్ ఉంది..   

   

కాగా సి. ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్‌ లుక్‌, టీజర్ ప్రేక్షకుల మనసులో నిలిచిపోగా ట్రైలర్ ఇంకా అందరిని అక్కటుకుంటుంది. తమిళంలో త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించిన '96' సినిమాకు జాను రీమేక్. ఒక విధంగా చెప్పాలంటే.. ఇప్పుడు రిలీజ్ అయినా ఈ ట్రైలర్ మళ్ళి మళ్ళి చూడాలనిపిస్తుంది. మీరు ఒకసారి చూసేయండి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: