తెలుగు తెరపై ఒక చిన్న నటుడిగా తన జీవితాన్ని ఆరభించి ఈ రోజు స్టార్ హోదాలో ఎందరో అభిమానులను సంపాదించుకున్న విజయ్ దేవరకొండ నిజంగా మంచి వ్యక్తిత్వం ఉన్న నటుడని అంటారు. ఎందుకంటే తనఫ్యాన్స్తో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ, తనకు సంబంధించిన అప్డేట్స్ తెలియచేస్తూ, షోషల్ మీడియాలో చురుగ్గా కదులుతుంటాడు. ఇకపోతే ఇప్పుడు విజయం బాటలో ద్విగిజయంగా ప్రయాణిస్తున్న విజయ్ 2011 లో వచ్చిన నువ్విలా చిత్రంతో, చిన్న పాత్రతో తెరంగేట్రం చేశాడు.
తర్వాత 2012 లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా లో కూడా చిన్న పాత్ర పోషించాడు. ఇక 2015లో విడుదలైన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలోని రిషి పాత్రతో ప్రేక్షకులకు లైట్గా గుర్తుండిపోయాడు.. కానీ విజయ్ని హీరోగా నలుగురికి తెలిసేలా చేసిన చిత్రం మాత్రం పెళ్ళి చూపులు అని చెప్పవచ్చు. 2016లో వచ్చిన ఈ సినిమాలోని నటనకు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకోవడమే కాదు. ఆయన కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా నిలిచింది. ఇకపోతే 2017 మొదట్లో ద్వారక అనే సినిమాతో వచ్చినా, ఆ సినిమా ఆశించినంత విజయాన్ని సాధించలేదు..
కానీ అదే సంవత్సరం అర్జున్ రెడ్డి తో ఎవరు ఊహించనంతటి విజయాన్ని తన సొంతం చేసుకున్నాడు. ఇకపోతే విజయ్ దేవరకొండ ఏం చేసిన అది కొత్తగానే కాదు అందరిని ఆశ్చర్యపరచేలా ఉంటుంది. ఎందుకంటే 2017 నుండి క్రిస్మస్ కానుకగా బహుమతులు ఇస్తూ వస్తున్న విజయ్ 2019 క్రిస్మస్ సందర్భంగా.. మీకు కావల్సిన గిఫ్ట్లు అడగండి.. తొమ్మిది లేదా పది కానుకలు ఇస్తాను. #Devarasanta కి పోస్ట్ చేయమని వీడియో ద్వారా పేర్కొన్నాడు.
ఈ అవకాశాన్ని ఎందరో ఉపయోగించుకోగా, అందులో, ఓ అభిమాని మ్యాక్ బుక్ ప్రో కావాలని కోరాడు. దీనిపై స్పందించిన విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ ద్వారా శివ శంకర్ రెడ్డి అనే అభిమాని ఇంటికి మ్యాక్ బుక్ ప్రోని పంపించి, ఆశ్చర్యపరిచాడు.. నిజం చెప్పలంటే తాను అభిమానించే హీరో నుండి ఇలా గిఫ్ట్ అందుకోవడం పిచ్చిగా అభిమానించే, అభిమానులకు కోటి రూపాయలతో సమానం..