జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పవన్ తో విడాకులు తీసుకున్న తర్వాత ప్రస్తుతం వేరుగా ఉంటున్న విషయం అందరికీ తెలిసినదే. తన పిల్లలతో కలిసి తన స్వరాష్ట్రం పూణేలో ఉంటున్న రేణు దేశాయ్ కెరియర్ పరంగా టెలివిజన్ రంగంలో కొన్ని డాన్స్ షో లకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. అంతే కాకుండా మరో పక్క సినిమాలు కూడా నిర్మిస్తూ కెరియర్ కొనసాగిస్తూ ఉంది. గతంలో మరో పెళ్లి చేసుకోబోతున్నట్లు రేణుదేశాయ్ గురించి అనేక వార్తలు అప్పట్లో రావటం జరిగాయి. అయితే ఆ పెళ్ళి విషయం సమయంలో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు..కొద్దిగా అతిగా ప్రవర్తించడంతో అప్పట్లో ఆ విషయం పెద్ద ఇష్యూ అయింది.

 

ఇటువంటి పరిస్థితుల్లో చాలా సందర్భాలలో రేణు దేశాయ్ పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానుల తో చాలాసార్లు వివాదాలు రావటం జరిగాయి. ఇటువంటి పరిస్థితుల్లో రేణుదేశాయ్ చాలా కాలం తర్వాత ఓ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పాల్గొన్నారు. చూసి చూడంగానే అనే సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన రేణు దేశాయ్ సినిమా నిర్మాత రాజ్ కందుకూరి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

సినిమా ఇండస్ట్రీ లో ఆడవాళ్లు రాణించాలంటే వాళ్లకు ఎటువంటి సమస్యలు పరిశ్రమలో ఎదురుకాకుండా ఉండాలంటే ఎటువంటి ఫిమేల్ టెక్నీషియన్ అయినా రాజ్ కందుకూరి తో పని చేస్తే చాల సేఫ్ గా వుంటారు అని నేను గర్వంగా చెప్పగలను అని రేణు దేశాయ్ అన్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో తనకి నటించే అవకాశం ఇచ్చారని చెప్పుకొచ్చిన రేణు దేశాయ్ రాజ్ కందుకూరి తో ఉంటే సేఫ్ గా ఉంటాను అని రేణు దేశాయ్ చెప్పారు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీ అవసరమని కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని సినిమా యూనిట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు రేణు దేశాయ్ చెప్పారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: