టాలీవుడ్ మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సంక్రాంతి పండుగకు ‘అల వైకుంఠపురములో’ సినిమా తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. సినిమా విడుదలయ్యే దాదాపు మూడు వారాలు దగ్గరకు వస్తున్న గాని సినిమా హాల్ దగ్గర మాటికి ఇంకా ప్రేక్షకుల తాకిడి ఎక్కువగానే ఉంది. సంక్రాంతికి వచ్చిన సినిమాల కంటే ‘అల వైకుంఠపురములో’ సినిమా అదిరిపోయే రేంజ్ లో సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటుగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక కొత్త రికార్డులు సృష్టిస్తోంది.

 

గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన రెండు సినిమాలు సూపర్ డూపర్ విజయాలు సాధించడంతో ‘అల వైకుంఠపురములో’ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు త్రివిక్రమ్ - బన్నీ. ఇదిలా ఉండగా త్రివిక్రమ్ తన తర్వాత సినిమా ఎన్టీఆర్ తో చేయడానికి రెడీ అయినట్లు అది ఈ సంవత్సరం సెకండాఫ్ లో మొదలు కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా వచ్చే సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

 

ఆ తర్వాత త్రివిక్రం వరుసబెట్టి మెగా కాంపౌండ్ హీరోలతో సినిమాలు చేయడానికి రెడీ అయినట్లు ఫిలింనగర్లో మరియు సోషల్ మీడియాలో గట్టిగా వార్తలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా మెగాస్టార్ చిరంజీవి తో సినిమా ఒకటి చేయడానికి రెడీ అవుతున్నట్లు ఆ సినిమా కొణిదెల ప్రొడక్షన్స్ – హారిక హాసిని బ్యానర్ లో నిర్మాణం జరగనున్నట్లు ఆ తర్వాత రామ్ చరణ్ తో హారిక హాసిని – పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ లో ఓ సినిమా చేయనున్నట్లు చివరిగా మూడో మెగా ప్రాజెక్ట్ మళ్లీ అల్లు అర్జున్ తో చేయనున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. దాదాపు ఈ ప్రాజెక్టులన్నీ అవటానికి డైరెక్టర్ త్రివిక్రమ్ కి ఐదు సంవత్సరాలు పని ఉన్నట్లు ముఖ్యంగా మెగా కాంపౌండ్ ఆఫర్ తో త్రివిక్రమ్ ఫుల్ బిజీ కానున్నట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: