పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి 26వ సినిమా షూటింగ్ ని ఇటీవల మొదలెట్టసారు. బాలీవుడ్ లో కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించిన పింక్ సినిమాకు అధికారిక రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఓ మై ఫ్రెండ్, ఎంసీఏ సినిమాల దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను మే లో రిలీజ్ చేసే అవకాశం కనపడుతోంది. ఇకపోతే ఈ సినిమా తరువాత పవన్, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. 

 

నేడు ఎంతో నార్మల్ గా అధికారిక పూజ కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి మొదటి వారం నుండి మొదలు కానున్నట్లు తెలుస్తోంది. మొఘలాయుల కాలం నటి కథతో తెరకెక్కనున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక గజ దొంగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం మంచి పవర్ఫుల్ స్క్రిప్ట్ ని అలానే హీరో, విలన్ ల క్యారెక్టర్లను రాసుకున్నాడట దర్శకుడు క్రిష్. ఇక విలన్ గా ఒక బాలీవుడ్ నటుడు నటించనున్నాడని, అలానే పవన్ సరసన ఇద్దరు కథానాయికలు నటిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా కోసం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ ఏరియాలో భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన తాజ్ మహల్

 

చార్మినార్ సెట్లను దాదాపుగా రూ.25 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారని, ఇప్పటికే పూర్తి కావచ్చిన ఈ సెట్టింగులు సినిమాలో ఎంతో కీలకం కానున్నాయని అంటున్నారు. అలానే సినిమా కోసం పలు ఇతర సెట్టింగులను కూడా రూపకల్పన చేసే పనిలో ఉందట సినిమా యూనిట్. కోలీవుడ్ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఎంతో భారీ వ్యయంతో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా అతి త్వరలో ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు  అధికారికంగా వెల్లడి కానున్నాయి.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: