టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు ఇప్పటికే మంచి సక్సెస్ ని అందుకుని ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించగా ప్రకాష్ రాజ్ విలన్ గా నటించారు. యువ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ లో సూపర్ స్టార్ మహేష్ యాక్షన్ ప్రధానాకర్షణగా నిలవగా, ఆయన వేసిన డ్యాన్సులకు ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల నుండి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. 

 

ఇక ప్రస్తుతం ఆ సినిమా సక్సెస్ ని తన ఫ్యామిలీతో కలిసి అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు, అతి త్వరలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన మహర్షి సినిమా ఎంతో పెద్ద విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దానితో అతి త్వరలో తెరకెక్కనున్న ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. ఇకపోతే మంచి యాక్షన్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరో పాత్రకు ధీటుగా విలన్ పాత్ర ఉండనుందని, 

 

అందుకని ఆ పాత్ర కోసం గతంలో మహర్షిలో విలన్ గా నటించిన జగపతి బాబునే మరొక్కసారి విలన్ గా తీసుకోవాలని వంశీ యోచిస్తున్నట్టు టాక్. ఇక ఈ విషయమై అతి త్వరలో జగపతి బాబుని కలవనున్నాడట దర్శకుడు వంశీ. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా మేలో పట్టాలెక్కుతుందని, తప్పకుండా మరొక్కసారి మహేష్, వంశీ ల కాంబినేషన్ లో రానున్న ఈ సినిమా, మరొక సెన్సేషనల్ హిట్ అవుతుందని టాలీవుడ్ వర్గాల టాక్. కాగా ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావలసి ఉంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: