ఎప్పటి నుంచో తెలుగు చిత్ర సీమలో మెగా వర్సెస్ నందమూరి అన్న నానుడి కొనసాగుతూనే వస్తోంది. గతంలో చిరంజీవికి బాలకృష్ణ పోటీ అని చెప్పిన వారు ఇప్పుడు రామ్ చరణ్ కు.. ఎన్టీఆర్ కు పోటీ పెట్టేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తుంటే మెగా ఫ్యామిలీ ఖచ్చితంగా నందమూరి ఫ్యామిలీ పై ఆధిక్యతలో ఉంది.

 

మెగా ఫ్యామిలీ లో రామ్ చరణ్, అల్లు అర్జున్ తో సహా చిరంజీవి కూడా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ ఉంటే ఇంకొక వైపు వారి పక్క ఎన్టీఆర్ ఒక్కడే ఒంటరిగా పోరాడుతున్నాడు. కానీ అతని చిత్రాలు ఎంత బాగా ఉన్నా కనీసం బ్రేక్ ఈవెన్ కూడా సాధించేందుకు చాలా కష్టపడుతున్నాయి. బాలకృష్ణ సినిమాలు పై అందరికీ ఆసక్తి తగ్గిపోయింది. ఇక తర్వాత స్థానంలో ఉండే కళ్యాణ్ రామ్ తన మనుగడ కోసం విపరీతంగా పాటు పడుతున్నాడు.

 

దాంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అన్నిటికన్నా పెద్ద కుటుంబమైన మెగా ఫ్యామిలీ ఇప్పుడు టాలీవుడ్ ను శాసించే స్థితిలో ఉందన్నది వాస్తవం. దాదాపు తొమ్మిది మంది అగ్ర కథానాయకులు ఉన్నా ఫ్యామిలీ ఇప్పుడు అత్యధిక సంఖ్యలో బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టింది. మరొకవైపు రికార్డుల మాట అటుంచితే వారి చిత్రానికి పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడానికి కూడా నందమూరి హీరోలు నానా తంటాలు పడుతున్నారు.

 

మొత్తం మీద తెలుగు చిత్రాలన్నిటిలో ఎక్కువ వసూళ్లు సాధించిన మొదటి ఐదు చిత్రాలలో మూడు మెగా హీరోలవి కావడం తో వారి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. మిగిలిన రెండూ కూడా బాహుబలి1 మరియు బాహుబలి 2 కావడం గమనార్హం. అల వైకుంఠ పురం లో, రంగస్థలం మరియు సైరా వరుసగా మూడు నాలుగు ఐదు స్థానాలను సంపాదించగా మహేష్ బాబు యొక్క సరిలేరు నీకెవ్వరు చిత్రం ఆరవ స్థానంలో ఉంది.

 

అలాగే మెగా ఫ్యామిలీ చేతిలో 2 సాలిడ్ నిర్మాణ సంస్థలు కూడా ఉన్నాయి. ఇంకా వాటికి చిన్న చిన్న విభాగాలు ఎన్నో. నందమూరి ఫ్యామిలీ ని ముందుకు తీసుకు వెళ్లాలంటే ప్రస్తుతం నందమూరి ఫ్యాన్స్ కు ఉన్న ఒకే ఒక్క నమ్మకం జూనియర్ ఎన్టీఆర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: